టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారు - కేంద్ర మంత్రి సుజనాచౌదరి
The bullet news (Vuyyuru)-చంద్రబాబు నాయుడి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్తాయిలోని ప్రజలందరికీ అందుతున్నాయనీ, అందుకు నిదర్శనంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి ప్రజలు నుంచి విశేష స్పందన రావడమేనని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు.. ఇవాళ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఓ కుటుంబ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు..అంతకుముందు వైఎస్ సుజనాచౌదరికి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను స్థానికంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నానని, స్థానిక ప్రజలు ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు పట్ల చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, మాజీ మండలాధ్యక్షులు భీమవరపు పిచ్చిరెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ దాసు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు..
టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారు - కేంద్ర మంత్రి సుజనాచౌదరి
Reviewed by ADMIN
on
September 21, 2017
Rating:
No comments: