కేతంరెడ్డి ఆధ్వర్యంలో విపీఆర్ ఇంటి వద్ద మిన్నంటిన సంబరాలు..
The bullet news (Nellore)- ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ కావడంతో నెల్లూరులో ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపో్యారు. వేమిరెడ్డి నివాసం వద్ద బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేశారు.. రాజకీయంగా తొలి అడుగులోనే పెద్దల సభకు ఎంపిక కావడం, జిల్లాలో ఒక రాజకీయ విశేషంగా ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.. ఇవాళ వేమిరెడ్డి రాజ్యసభకు నామినెటెట్ అయ్యాడంటూ ద్రువీకరణ కాగానే నెల్లూరు నగరంలోని ఆయన నివాసం ఉన్న మాగుంట లేవుట్ లోని స్విమ్స్ కోర్టు ప్రాంతం బాణాసంచాలతో దద్దరిల్లింది.. వేలాది మంది వైసీపీ కార్యకర్తలు వేమిరెడ్డి నివాసానికి చేరుకుని నెల్లూరు జిల్లాలో మరో మాగుంట తరహా రాష్ట రాజకీయాల్లో విపీఆర్ ప్రధాన భూమిక పోషించబోతున్నట్లు పేర్కొన్నారు.. రాజకీయాల్లో వేమిరెడ్డి ఒక రోల్ మోడల్ అవుతాడని వైసీపీ యువజన విభాగం నాయకుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరుడు కేతం రెడ్డి వినోద్ రెడ్డి పేర్కొన్నారు..
కేతంరెడ్డి ఆధ్వర్యంలో విపీఆర్ ఇంటి వద్ద మిన్నంటిన సంబరాలు..
Reviewed by ADMIN
on
March 15, 2018
Rating:
No comments: