Top Ad unit 728 × 90

ఆదిశంకర కాలేజీపై వెలువెత్తుతున్న నిరసనలు..

THE BULLET NEWS (GUDUR)-మాధవి ఆత్మహత్యకు కారణమైన గూడూరు ఆదిశంకర కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపి, టిఎన్ ఎస్ ఎప్ నాయకులు రోడ్డెక్కారు..గూడూరులోని క్లాక్ టవర్ వద్ద మనోజ్ ఆద్వర్యంలో ఏబీవీపి నాయకులు, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టిఎన్ ఎస్ ఎప్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ ఆద్వర్యంలో ఆందోళన నిర్వహించారు.. గూడూరు డివిజన్ కార్యదర్శి మనోజ్ కుమార్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ దర్నాలో మనోజ్ ఆదిశంకర కాలేజీపై మండిపడ్డారు. హాస్టల్ లో సెల్ ఫోన్ చోరీకి గురైందనే నెపంతో మాధవిని అవమానించడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుందని మనోజ్ ఆరోపించారు. ఆదిశంకర హాస్టల్ కు అనుమతులు సైతం లేవని హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మనోజ్ డిమాండ్ చేశారు.. ఇదే విషయంపై ఏబీవీపి ప్రశ్నిస్తే కాలేజీ యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెబుతోందని మనో్జ్ విమర్శించారు.. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్దుల ప్రాణాలను తీసేవిధంగా ఆధిశంకర వ్యవహరిస్తోందని వెంకటేష్ ఆరోపించారు.. హాస్టల్ రూమ్ లోకి సెల్ ఫోన్లను యాజమాన్యం ఎలా అనుమతిచ్చిందని ఆయన ప్రశ్నించారు.. వెంటనే అదిశంకరాపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..
ఆదిశంకర కాలేజీపై వెలువెత్తుతున్న నిరసనలు.. Reviewed by ADMIN on March 20, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.