Top Ad unit 728 × 90

ఎలక్ట్రానిక్‌ మీడియా, వెబ్‌సైట్‌ల తీరును తప్పుపట్టిన సుప్రీం...

THE BULLET NEWS (DELHI)-ఎలక్ట్రానిక్‌ మీడియా,వెబ్‌సైట్‌లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఓవైపు మీడియా స్వాతంత్ర్యానికి గౌరవమిస్తూనే మరోవైపు బాధ్యతలను కూడా గుర్తు చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా తమను తాము పోప్‌గా భావించకూడదని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్‌ మీడియా, వెబ్‌సైట్‌లో రాసేవాళ్లు తాము ఏదైనా రాయొచ్చని హద్దు లేకుండా ప్రవర్తిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. జర్నలిస్ట్‌ రోహిణి సింగ్‌ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ హెచ్చరిక చేసింది. 'ద వైర్‌' వెబ్‌సైట్‌ జర్నలిస్టు రోహిణి సింగ్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కేసు విచారణపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 12కి వాయిదా వేసింది. అక్రమ ఆస్తులపై రాసినందుకు 'ద వైర్‌' జర్నలిస్టు రోహిణి సింగ్‌పై అమిత్‌ షా కుమారుడు జై షా పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

 
ఎలక్ట్రానిక్‌ మీడియా, వెబ్‌సైట్‌ల తీరును తప్పుపట్టిన సుప్రీం... Reviewed by ADMIN on March 16, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.