జగన్ పాదయాత్ర విజయవంతాన్ని కోరుతూ...
THE BULLET NEWS -జగన్ చేపట్టిన మహా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.. జగన్ సీఎం కావాలని కోరుతూ నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి తిరుమలకు పాదయాత్ర చేపట్టగా అదే బాటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా జగన్ చేపట్టబోయే యాత్ర విజయవంతం కావాలని కోరుతూ వడమలపేట అపాలయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో 1008 కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమన్నారు.. ప్రజలు జగన్ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు..
జగన్ పాదయాత్ర విజయవంతాన్ని కోరుతూ...
Reviewed by ADMIN
on
November 01, 2017
Rating:
No comments: