ఝాన్సీ లక్ష్మీ బాయిలాగా విద్యార్థినులు అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలి..
The Bullet News ( Guduru ) _ చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడిన గొప్ప వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయి అని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్ తెలిపారు. ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి వేడుకలను స్థానిక గిరిజన హాస్టల్లో ఎబివిపి నాయకులు నిర్వహించారు.. వ్యాస రచన పోటీలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ లక్ష్మి బాయి జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.. విద్యార్థినులు దైర్యంగా అన్యాయం పై పోరాడాలన్నారు.. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.. అంతకు ముందు ఆమె చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి మనోజ్, రవి, చిన్న, జార్జ్, తేజ, సూర్య తదితరులు పాల్గొన్నారు
ఝాన్సీ లక్ష్మీ బాయిలాగా విద్యార్థినులు అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలి..
Reviewed by ADMIN
on
November 19, 2017
Rating:
No comments: