రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి- సమీక్షా సమావేశంలో మంత్రి కామినేని
The bullet news (Nellore)- జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ, సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు.. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో జ్వరాలు మరియు సీజనల్ వ్యాధులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.. సీజనల్ వ్యాధులు తగ్గే వరకు డాక్టర్లకు శెలవును రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.. సామాజిక ఆసుపత్రులలో ప్లేట్ లేట్స్ యంత్రాలు తప్పనిసరిగా ఉండాలని అలా లేని ఆసుపత్రులలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.. డాక్టర్లు కచ్చితంగా ఉదయం గం.9 నుంచి సాయంత్రం గం.4 వరకు ఆస్పత్రిలోనే రోగులకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశాలకు జారీ చేశారు.. వారి డ్యూటి సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తే వారితో పాటు వారి పర్యవేక్షాణాధికారులను సైతం బాధ్యులుగా చేస్తామని ఆయన హెచ్చరించారు.. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఉన్నారు..
రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి- సమీక్షా సమావేశంలో మంత్రి కామినేని
Reviewed by ADMIN
on
November 04, 2017
Rating:
No comments: