ఎంపీ ల్యాడ్స్ ద్వారా మరింత అభివృద్ది కార్యక్రమాలు - తిరుపతి ఎంపీ వరప్రసాద్
The bullet news (Venkata Giri)- వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ది కోసం సమన్వయ కర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని తిరుపతి ఎంపీ వరప్రసాద్ అన్నారు.. వెంకటగిరి పట్టణంలోని ఎస్టీ, ఎస్సీ కాలనీలో బొమ్మిరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. వృద్దులను ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన పర్యవేక్షించారు.. పించన్లు, రుణాలు తదితర అంశాలపై ఎస్సీ, ఎస్టీ కాలనీ వాసులతో మాట్లాడారు.. మరుగుదొడ్ల బిల్లులు సక్రమంగా అందాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరిలోని మన్నేగుంట ఎస్టీ కాలనీకి రోడ్డు నిర్మాణం గురంచి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తన దృష్టికి తీసుకొచ్చారని వెంటనే నిధులు మంజూరు చేశానన్నారు.. జగన్ ప్రభుత్వం రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.. జగన్ చేపట్టబోతున్న మహా సంకల్ప యాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి ఆయన్ని ఆశీర్వదించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు..
ఎంపీ ల్యాడ్స్ ద్వారా మరింత అభివృద్ది కార్యక్రమాలు - తిరుపతి ఎంపీ వరప్రసాద్
Reviewed by ADMIN
on
November 04, 2017
Rating:
No comments: