త్రిపురలో మరో జర్నలిస్ట్ హత్య..
The Bullet News ( Tripura ) _ త్రిపురలో ఒక జర్నలిస్టు హత్యకు గురయ్యాడు.ఒక పోలీస్ తన చేతిలో ఉన్న రైఫిల్ తో ఆవేశంలో కాల్చడంతో సుదీవ్ దత్తా బౌమిక్ అనే జర్నలిస్టు మరణించాడు.ఆయన స్తానిక స్పందన్ అనే పత్రికలో పనిచేస్తున్నాడు. త్రిపుర రాష్ట్రీయ రైఫిల్స్కు సెకండ్ బెటాలియన్ కమాండెంట్ను కలిసేందుకు జర్నలిస్టు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. కమాండెంట్ను కలిసేందుకు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడున్న భద్రతాసిబ్బంది తపన్ దేవర్మ అడ్డుకున్నాడు.ఆ దశలో ఇరువురి మధ్య మాటామాటా పెరగ్గా , ఆవేశానికి గురైన తపన్ తన దగ్గరున్న తుపాకీ తీసి సుదీప్పై కాల్పులు జరిపాడని సమాచారం.ఆ సమాచారం అందుకున్న పోలీసులు తపన్ ను అరెస్టు చేశారు.
త్రిపురలో మరో జర్నలిస్ట్ హత్య..
Reviewed by ADMIN
on
November 21, 2017
Rating:
No comments: