స్థానిక సమస్యలను పరిష్కరించేందుకే ఈ పల్లె నిద్ర - బొమ్మిరెడ్డి
The bullet News (Rapur)- అధికారమే అండగా తెలుగు తమ్ముళ్లు గ్రామస్థాయిలో దుర్మార్గాలకు తెగబడుతున్నారు.. అర్హులైన వారికి పించన్లు ఇవ్వకుండా తమ పార్టీ వాళ్ల పేర్లు చేర్చుకుంటున్నారు. స్థానికంగా దిష్టేసిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు, మీతో కలిసి అన్యాయంపై పోరాడేందుకు మీ అందరికీ తోడుగా నేనుంటానంటూ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రాపూరు మండలం గెరిమేనపెంట, తెగచర్ల గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.. పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన గెరిమేనపెంట, తెగచర్ల గ్రామాల్లో తిరుపతి ఎంపి వరప్రసాద్ తో కలిసి పర్యటించారు.. స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. దాదాపు 57 మంది వారు ఎదుర్కొంటున్న భూ సమస్యను బొమ్మిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.. వెంటనే స్పందించిన ఆయన ఫోన్ లో కలెక్టర్ తో మాట్లాడారు.. అవసరమైతే నేరుగా కలెక్టర్ ను కలిసి సమస్య పరిష్కారమయ్యేంత వరకు తోడుంటానన్నారు.. అనంతరం స్థానికంగా ఓ టీడీపీ నేత తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా అన్యాయంపై అందరం కలిసి పోరాడదామని, అందుకు తానెప్పుడూ సిద్దంగానే ఉంటానన్నారు.. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ బొమ్మిరెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసం పరితపిస్తున్నారని, ఆయన చొరవతోనే ఎంపీ ల్యాడ్స్ ఖర్చు చే్స్తున్నామన్నారు.. తన నిధుల నుంచి రూ.5 లక్షల అభివృద్ది పనులకు ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాపూరం మండల కన్వీనర్ బండి కృష్టారెడ్డి, నెల్లూరు రవింద్రరెడ్డి. బి పట్టబిరామిరెడ్డి.తెగచర్ల జయమ్మ సుబ్బారెడ్డి తదితరులున్నారు..
స్థానిక సమస్యలను పరిష్కరించేందుకే ఈ పల్లె నిద్ర - బొమ్మిరెడ్డి
Reviewed by ADMIN
on
November 13, 2017
Rating:
No comments: