జగన్ @ 1500 కి.మీ...
THE BULLET NEWS (GUNTUR)-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ములుకుదురులో మొక్కను నాటారు. వైఎస్ జగన్ 2017 నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం విదితమే.
ఈ 1500 కిలోమీటర్ల దారిలో ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని ఊళ్లు, ఎందరు ప్రజలు, ఎన్ని సమస్యలు...సహనంతో వాటిని వింటూ, ప్రజలకి భరోసాని పంచుతూ ముందుకు సాగుతున్నారు ప్రతపక్ష నేత. 180 రోజులపాటు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూర్తి కాగా ఈ నెల 12న గుంటూరు జిల్లాలోని ప్రవేశించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ములుకుదురులో మొక్కను నాటారు. వైఎస్ జగన్ 2017 నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం విదితమే.
ఈ 1500 కిలోమీటర్ల దారిలో ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని ఊళ్లు, ఎందరు ప్రజలు, ఎన్ని సమస్యలు...సహనంతో వాటిని వింటూ, ప్రజలకి భరోసాని పంచుతూ ముందుకు సాగుతున్నారు ప్రతపక్ష నేత. 180 రోజులపాటు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూర్తి కాగా ఈ నెల 12న గుంటూరు జిల్లాలోని ప్రవేశించింది.
జగన్ @ 1500 కి.మీ...
Reviewed by ADMIN
on
March 14, 2018
Rating:
No comments: