టెట్ ఫలితాల్లో శ్రీ అక్షర విజయదుంధుభి
The bullet news ( Nellore) _ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) ఫలితాల్లో నెల్లూరు ఆచారివీధిలోనున్న శ్రీ అక్షర డి.ఎస్.సి కోచింగ్ సెంటర్ విజయదుంధుభి మోగించింది. శ్రీ అక్షర నుండి మొత్తం 298 మంది అభ్యర్ధులు టెట్ పరీక్షలు రాయగా, వారిలో అత్యధికంగా 294 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్ధుల్లో 200 మంది, 150 మార్కులకు గానూ 110 మార్కులకు పైగా సాధించి తమ సత్తా చాటారు. మరో ఇద్దరు అభ్యర్ధులు 128 మార్కులు సాధించి శ్రీ అక్షర డిఎస్సి కోచింగ్ సెంటర్ కు సాటి లేదని నిరూపించారు. ఈ సందర్భంగా ఆచారి వీధిలోనున్న శ్రీ అక్షర కోచింగ్ సెంటర్ లో విజయోత్సవాలు నిర్వహించారు. కోచింగ్ సెంటర్ ఛైర్ పర్సన్ కొండా శిరీష, వైస్ ప్రెసిడెంట్ వినీల్ రెడ్డి, కార్యదర్శి నారుబోయిన రత్నమ్మ లు అర్హత సాధించిన అభ్యర్ధులను అభినందించారు. సీనియర్ అధ్యాపక బృందం కృషి వల్లే ఈ ఫలితాలను సాధించగలిగామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.
టెట్ ఫలితాల్లో శ్రీ అక్షర విజయదుంధుభి
Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: