600లమంది రైతుల ధర్నా...
THE BULLET NEWS (KAMAREDDY)-జుక్కల్ మండలంలోని ఎక్స్రోడ్డులో 600 మంది పైగా రైతులు మండుటెండను లెక్క చేయకుండా ధర్నా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు అస్సెన్మెంట్ భూమికి సంబంధించిన పట్టాదారుల వివరాలు... ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన మొదటి విడుతలో నమోదు కాకపోవడం గ్రహించి ధర్నాకు దిగారు. సుమారు వెయ్యి ఎకరాల సాగు భూమిలో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ పనులు నిర్వహించడంతో రైతుల ఆందోళన ఉధృతం చేశారు. రైతుల ధర్నాకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యాక్షులు, పలు దళిత నాయకులు పాల్గొన్నారు. రైతుల ధర్నాకు స్పందించిన స్థానిక తహసిల్దార్ మీ భూములు ఎక్కడి పోవు అని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
600లమంది రైతుల ధర్నా...
Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: