రూరల్ ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలంటూ పూజలు..
The bullet news ( Nellore) _ అస్వస్థతకు గురై హాస్పటల్ లో చికిత్స పొందుతున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. నగరం లోని వినాయకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే ఆరోగ్యం కుదుటపడాలని వారు ఆకాంక్షించారు.. ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్ధన్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి త్వరగా కోలుకోవాలన్నారు.. దేవుడి ఆశీస్సులు ఎమ్మెల్యేకి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో నాయకులు మదన్, సాయి, జగదీష్, సిరాజ్, నవీన్, కామేష్, రాజేష్, శ్రీకాంత్, దినేష్ పాల్గొన్నారు
రూరల్ ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలంటూ పూజలు..
Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: