జూదమాడుతూ పట్టుబడిన జిల్లా పోలీసులు
The bullet news(nellore)- గుంటూరులో జూదం ఆడుతున్న నెల్లూరు పోలీసులను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. అమరావతిలో సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నెల్లూరు జిల్లా నుంచి 100 మందికిపైగా ఏఆర్ పోలీసులు బందోబస్తుకు వెళ్లారు. వీరికి నాగార్జున విశ్వవిద్యాలయంలోని శాతవాహన బాలుర హాస్టల్లో వసతి కల్పించారు. ఎం.వెంకట కిషోర్, బి.జనార్దన్, ఎన్.సురేష్, సీహెచ్ నందకుమార్ జూదమాడుతున్నారు. తనిఖీల్లో భాగంగా మంగళగిరి గ్రామీణ సీఐ దాడుల్లో వీరిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.500 స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసుకున్నారు. దాంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించి పోలీసు ప్రతిష్ఠతను దెబ్బతీస్తూ జూదమాడిన నలుగురిని జిల్లా ఎస్పీ రామకృష్ణ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జూదమాడుతూ పట్టుబడిన జిల్లా పోలీసులు
Reviewed by ADMIN
on
March 06, 2018
Rating:
No comments: