Top Ad unit 728 × 90

హస్తిన ధర్నా లో కలిమిలి...

[gallery link="none" td_select_gallery_slide="slide" ids="6584"]

THE BULLET NEWS (NEW DELHI)- హోదా కోసం పార్లమెంటులో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా పోరాడుతారని, ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన తెలిపారు. అయినా, కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్‌ 6న పార్టీ ఎంపీలతా రాజీనామా చేస్తారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగబోదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్‌ఆర్‌సీపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు.ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో ఈ రోజు చేపట్టిన మహాధర్నా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’’ అన్న నినాదంతో చేపట్టిన ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, వెంకటగిరి కిలిమిలి రాంప్రసాద్, ముఖ్యనేతలతోపాటు శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకుల మాట్లాడుతూ.. హోదా కోసం మొదటినుంచి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. హోదా కాకుండా కేంద్రం ప్యాకేజీ ఇస్తానంటే చంద్రబాబు ఏం మాట్లాడలేదని గుర్తుచేశారు. మహాధర్నా సందర్భంగా  సంసద్‌మార్గ్‌ ప్రాంతమంతా వైఎస్సార్‌సీపీ శ్రేణులతో నిండిపోయింది. వైఎస్‌ఆర్‌సీపీ జెండాల రెపరెపలు.. కార్యకర్తల నినదాలతో ఆ ప్రాంతం హోరెత్తుతోంది. ‘ప్రత్యేక హోదా భిక్ష కాదు.. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉత్సాహంగా మహాధర్నాలో పాల్గొన్నారు.
హస్తిన ధర్నా లో కలిమిలి... Reviewed by ADMIN on March 05, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.