పల్లె ప్రగతికి ఉపగ్రహ పరిజ్ఞానం
The bullet news(sriharikota)- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయనుంది. ఇందుకోసం ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధిలో భాగస్వాములుగా ఎన్జీవోలు, వివిధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఉండనున్నాయి. ఇందుకుగాను ఇస్రో పైలెట్ ప్రాజెక్టు కింద రూ.18 కోట్ల వ్యయంతో 473 గ్రామీణ వనరు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ వనరు కేంద్రాల ద్వారా టెలి హెల్త్కేర్, టెలి ఎడ్యుకేషన్, సహజ వనరుల సమాచారం, వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, గ్రామీణ విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ తదితర వాటికి అంతరిక్ష సాంకేతికత సేవలను అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన స్థలాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అంతరిక్ష సాంకేతిక సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో సామాజిక అభివృద్ధి కీలక పాత్ర పోషించనుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాడి పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు చాలా తక్కువ. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలోని భూములు సారవంతమైనవిగా ఉండాలి. దీని ద్వారా పాడిపరిశ్రమకు అవసరమైన మేత, తదితర వాటిని సమకూర్చుకునే అవకాశం ఉంది. అంతరిక్ష సాంకేతిక సేవల ద్వారా పాడిపరిశ్రమలకు అవసరమైన భూములను గుర్తించనున్నారు. ఉపయోగంలోని బీడు భూముల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. పశుగ్రాసం సాగు, పంటల అంచనా వేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడ అంతరిక్ష సాంకేతికత ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. ఇప్పటికే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపగ్రహ సేవలను వినియోస్తున్నారు. మరింత సేవల ద్వారా పర్యవేక్షణ పెంచనున్నారు. మెట్ట ప్రాంతాల్లో నీటి వనరుల పెంపునకుగాను సమీకృత వాటర్ షెడ్ల అభివృదికి అంతరిక్ష అధారిత సేవలను సద్వినియోగం చేసుకోనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇందులో ముఖ్యంగా భూగర్భ జలాల పెంపు కీలకం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నదీ పరీవాహక ప్రాంతాల ప్రాధాన్యమివ్వడాని,¨ ఆ ప్రాంతాల్లోని ఇంధన ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయనున్నారు ఇస్రో ఇప్పటికే జాతీయ స్థాయిలో భూగర్భ జలాల పటాలను రూపొందించి, వాటిని విడుదల చేయడం జరిగింది. వీటిల్లో రీఛార్జ్ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటికి కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ తమవంతు సహకారం అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్లు మేనేజ్మెంటు కార్యక్రమానికి 86వేలు మైక్రోవేటర్ షీట్లు, మట్టి, నీటి పరిరక్షణ, ఉపగ్రహ డేటా, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, మూల్యాంకనం కోసం 180 జిల్లాల్లో స్థిరమైన భూమి, నీటి వనరుల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించింది. మన ప్రభుత్వం ఒప్పందం : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఉపగ్రహ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలుగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడ ఒప్పందం చేసుకుంది. ఇందుగాను గతేడు జులైలో ఇస్రోతో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒప్పందం చేసుకున్నారు. ఇస్రో సాంకేతికత ద్వారా వాతావరణ సమాచారం, భూపరిశీలన, వ్యవసాయం, పంటల దిగుబడి, భూగర్భ జలాలు, అటవీ భూముల, మత్స్యకారులకు అవసరమైన సమాచారం, తదితర వాటిని అందుకోనున్నారు.
పల్లె ప్రగతికి ఉపగ్రహ పరిజ్ఞానం
Reviewed by ADMIN
on
March 22, 2018
Rating:
No comments: