జోరువానలో ఇంటింటికి టీడీపీ - సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
THE BULLET NEWS (MUTUKUR)-ముత్తుకూరు అరుంధతీయవాడలో టీడీపీ సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలనుంచి అపూర్వ స్వాగతం లభించింది. జోరువానను సైతం ప్రజలు లెక్కచేయకుండా రాజగోపాల్ రెడ్డి వెంట నడిచారు. అడుగడుగునా మంగళ హారతులిస్తూ పూలతో ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి సోమిరెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రతి
ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి అందజేయడం జరుగుతుందన్నారు. స్థానిక సమస్యలను నాన్న దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి రిజర్వాయర్ డిస్ట్రీబ్యూటరీ చైర్మన్ ఈదూరు. రామ్మోహన్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి అందజేయడం జరుగుతుందన్నారు. స్థానిక సమస్యలను నాన్న దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి రిజర్వాయర్ డిస్ట్రీబ్యూటరీ చైర్మన్ ఈదూరు. రామ్మోహన్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జోరువానలో ఇంటింటికి టీడీపీ - సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Reviewed by ADMIN
on
September 25, 2017
Rating:
No comments: