మా పార్టీలోనే మహిళలకు ప్రాధాన్యత - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
The bullet news ( Nellore )_ రాజకీయాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైయస్సార్, జగన్ లదేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మహిళ సాధికారత గురించి, వైసీపీలో మహిళల ప్రాధాన్యత గురించి వివరించారు.. పార్లమెంటరి జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరి, నగర అధ్యక్షురాలు తోట శోభారాణి లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడారు.. వైసీపీ అధినేత జగన్ ఆలోచనలను, ఆకాంక్ష లను రూరల్ నియోజకవర్గంలో అమలు చేస్తామన్నారు.. మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైయస్సార్ కి దక్కుతుందన్నారు.. సబితా ఇంద్రారెడ్డిని హోమ్ మంత్రిని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. అనంతరం గౌరి మాట్లాడుతూ నవరత్నాలను గడప గడపకు తీసుకెళ్లడంలో మహిళలు చురుగ్గా పని చేయాలన్నారు.. మహిళ సమస్యలపై వైసీపీ మహిళా విభాగము ఆధ్వర్యంలో పోరాటాలు సాగిస్తామన్నారు..
మా పార్టీలోనే మహిళలకు ప్రాధాన్యత - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Reviewed by ADMIN
on
February 26, 2018
Rating:
No comments: