పించన్ల మంజూరులో నిర్లక్ష్యం చేస్తే సహించను - ఎమ్మెల్యే కోటంరెడ్డి
The bullet news (Nellore)_ అన్ని అర్హతలున్నావృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు పించన్లు మంజూరులో జరుగుతున్న అన్యాయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసించారు.. వికలాంగులను చేతులమీద ఎత్తుకుని మరీ కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ కు హాజరయ్యారు.. దాదాపు వందల మంది వ్రుద్దులు, వికలాంగులు, వితంతువులను వెంటబెట్టుకుని జేసీ ఇంతియాజ్ తో మాట్లాడారు.. అన్ని అర్హతలున్నా.. పించన్లు మంజూరు చేయడంలో అధికారులు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.. ప్రతిపక్షఎమ్మెల్యేలు చెబితే తామెందుకు చెయ్యాలనే దోరణిలో అధికారులు వున్నారని వారు వారి పద్దతిని మార్చుకోకపోతే కార్యాలయాల ముందు ఆందోళనకు దిగుతానని ఆయన హెచ్చరించారు.. జేసీ హమీ ఇచ్చిన ప్రకారం జనవరి 30లోపు పించన్లు మంజూరు చేయాలన్నారు.. పించన్లు మంజూరు చేయకుండా దళితులను ఇబ్బందులకు గురిచేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పించన్ల మంజూరులో నిర్లక్ష్యం చేస్తే సహించను - ఎమ్మెల్యే కోటంరెడ్డి
Reviewed by ADMIN
on
November 20, 2017
Rating:
No comments: