తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకున్న నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు
The Bullet News ( Tirumala ) - నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు..ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ నైవేద్య సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.. ఇదే సమయంలో జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పలువురు నాయకులు శనివారం ఉదయం నైవేద్య సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపం చేరుకున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని వేద పండితులు ఆశీర్వదించారు.. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరకున్నట్లు బొమ్మిరెడ్డి చెప్పారు. స్వామి వారిని దర్శించుకున్న వాటిలో పెళ్లకూరు ఎంపిపి కామిరెడ్డి సత్య నారాయణ రెడ్డి, బాల చంద్రారెడ్డి, సతీష్ రెడ్డి ఉన్నారు..
తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకున్న నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు
Reviewed by ADMIN
on
November 04, 2017
Rating:
No comments: