రూ.2.50 కోట్లతో కోడూరుపాడు రింగురోడ్డు
The bullet news(nellore)- నెల్లూరు గ్రామీణ మండలం కోడూరుపాడుకు రింగురోడ్డు ఏర్పాటుకు రూ.2.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. శనివారం కోడూరుపాడు ఎస్సీ కాలనీకి విచ్చేసిన మంత్రికి తెదేపా జిల్లా సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు హారతులిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ కాలనీలో పర్యటించిన మంత్రి వీధులన్నీ సిమెంటు రోడ్లు నిర్మాణాన్ని చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మంత్రి మాట్లాడుతూ.. నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లోని ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.111 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దళితవాడల్లో మౌలిక వసతులు కల్పనే రాష్ట్ర ముఖ్యమంత్రి ధ్యేయమని తెలిపారు. మార్చి 31వ తేదీ లోపు ఎస్సీ సబ్ప్లాన్ నిధులను ఖర్చు చేయాల్సి ఉందన్నారు. కోడూరుపాడులోని ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.6.30కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామీణ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కోడూరుపాడు రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఉందన్నారు. ట్రాఫిక్ను మళ్లించేందుకు ఇక్కడ రింగ్ రోడ్డు చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆనం జయకుమార్రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, తాళ్లపాక అనూరాధ, పొత్తూరి శైలజ, కార్పొరేటర్ లేబూరు పరమేశ్వరరెడ్డి, నూనె మల్లికార్జునయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.2.50 కోట్లతో కోడూరుపాడు రింగురోడ్డు
Reviewed by ADMIN
on
February 25, 2018
Rating:
No comments: