Top Ad unit 728 × 90

విద్యార్దిలోకమంతా జగన్ వెంటే - వైసీపీ విద్యార్ది విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్

The bullet news (Nellore)-   ప్రత్యేకహోదా ఆంద్రుల హక్కంటూ విద్యార్దిలోకం రోడ్డెక్కింది.. ప్రత్యేకహోదా ఆంద్రుల
హక్కంటూ నెల్లూరులో వైసీపీ విద్యార్ది యూనియన్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.. నగరంలోని విఆర్సీ సెంటర్
వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్దులు, వైసీపీ విద్యార్ది విభాగం నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా జిల్లా
అద్యక్షులు శ్రావణ్ మాట్టాడుతూ ప్రత్యేకహోదాపై బిజేపీ, టీడీపీలు దొంగనాటకాలాడుతున్నాయన్నారు.. విభజన చట్టంలో
పొందుపరిచిన అంశాలను నెరవేర్చడంలో బిజేపీ మాటతప్పితే హక్కుల కోసం పో్రాడాల్సిన టీడీపీ ఘోరంగా
విఫలమైందన్నారు.. చంద్రబాబు నాయుడు హోదా విషయంలో ద్వంద వైఖరి అవలంబిస్తూ ఏపీ ప్రజల గొంతు నొక్కే
ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ నాయకుడు జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యార్దిలోకమంతా ఒకతాటిపైకొచ్చి
ప్రత్యేకహోదాపై పోరాటం కొనసాగిస్తామన్నారు.. మార్చి 1న కలెక్టరేట్ల ముట్టడి, మార్చి 5 చలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం
చేయాలని శ్రావణ్ పిలుపునిచ్చాడు.. ఈ కార్యక్రమంలో విద్యార్ది విభాగం నాయకులు మదన్, హాజీ తదితరులున్నారు..
విద్యార్దిలోకమంతా జగన్ వెంటే - వైసీపీ విద్యార్ది విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ Reviewed by ADMIN on February 27, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.