కోదండరాముని సన్నిధిలో భారీ వర్షం... భక్తులకు తప్పని ఇక్కట్లు...
THE BULLET NEWS (ONTIMITTA)-
ఒంటిమిట్ట: కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణానికి వర్షం ఆటంకంగా మారింది. వడగళ్ల వాన కురవడంతో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. భారీ వర్షంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అకాల వర్షంతో కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో వీస్తోన్న ఈదురు గాలులకు కల్యాణవేదిక వద్ద ఉన్న రేకులు ఎగిరి పడ్డాయి. దీంతో కొందరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. స్వామివారి కల్యాణ వేదిక వద్దకు వర్షం నీరు చేరడంతో కల్యాణం చూడకుండానే భక్తులు వెనుదిరుగుతున్నారు.
సీఎం పర్యటనలో ఆలస్యం
భారీ వర్షం కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రాములోరి కల్యాణం జరగనున్న నేపథ్యంలో ఆయన 7 గంటలకే ఒంటిమిట్టకు చేరుకోవాల్సి ఉండగా ఆయన ఇంకా కడప ఆర్అండ్ బీ వసతి గృహంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఒంటిమిట్టకు చేరుకున్న తర్వాత ఆయన తితిదే నిర్మించిన వసతి గృహాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఆ తర్వాత మూలవిరాట్ను దర్శించుకొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించాల్సి ఉన్నప్పటికీ ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షంతో ఆయన ఆర్అండ్బీ వసతి గృహంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం జనరేటర్ల ద్వారా ఒంటిమిట్ట స్వామివారి ఆలయంలో విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ భక్తులకు కొంత అసౌకర్యం నెలకొంది.
ఒంటిమిట్ట: కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణానికి వర్షం ఆటంకంగా మారింది. వడగళ్ల వాన కురవడంతో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. భారీ వర్షంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అకాల వర్షంతో కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో వీస్తోన్న ఈదురు గాలులకు కల్యాణవేదిక వద్ద ఉన్న రేకులు ఎగిరి పడ్డాయి. దీంతో కొందరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. స్వామివారి కల్యాణ వేదిక వద్దకు వర్షం నీరు చేరడంతో కల్యాణం చూడకుండానే భక్తులు వెనుదిరుగుతున్నారు.
సీఎం పర్యటనలో ఆలస్యం
భారీ వర్షం కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రాములోరి కల్యాణం జరగనున్న నేపథ్యంలో ఆయన 7 గంటలకే ఒంటిమిట్టకు చేరుకోవాల్సి ఉండగా ఆయన ఇంకా కడప ఆర్అండ్ బీ వసతి గృహంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఒంటిమిట్టకు చేరుకున్న తర్వాత ఆయన తితిదే నిర్మించిన వసతి గృహాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఆ తర్వాత మూలవిరాట్ను దర్శించుకొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించాల్సి ఉన్నప్పటికీ ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షంతో ఆయన ఆర్అండ్బీ వసతి గృహంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం జనరేటర్ల ద్వారా ఒంటిమిట్ట స్వామివారి ఆలయంలో విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ భక్తులకు కొంత అసౌకర్యం నెలకొంది.
కోదండరాముని సన్నిధిలో భారీ వర్షం... భక్తులకు తప్పని ఇక్కట్లు...
Reviewed by ADMIN
on
March 30, 2018
Rating:
No comments: