చంద్రబాబు అనుమతి అవసరంలేదు- విజయసాయిరెడ్డి
THE BULLET NEWS (NEW DELHI)- సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాను ఎవరినైనా కలవాలంటే సీఎం చంద్రబాబు అనుమతి అవసరంలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎవరిని కలిసినా ప్రజా సమస్యలు చర్చించడానికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రధాని మోదీని మూడుసార్లు కలిసి ప్రజా సమస్యలపై చర్చించానని, అవిశ్వాసం చర్చకు రావాలని చిత్తశుద్ధితో కోరుకుంటున్నామని విజయసాయి చెప్పారు. విజయసాయి, ప్రధాని భేటీపై టీడీపీ ఇప్పటీకే అనేక సార్లు విమర్శలు గుప్పించింది.ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ సమావేశం తర్వాత విజయసాయిరెడ్డి పదుల సార్లు ప్రధానితో సమావేశమయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది. విజయసాయి ఢిల్లీలో ఉంటే ఎక్కవ సార్లు పీఎంవో చుట్టూ తిరుగుతుంటారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. టీడీపీని వదిలించుకుని వైసీపీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని చాలాకాలంగా ఆరోపణలొస్తున్నాయి. జగన్ కేసులను అడ్డం పెట్టుకుని బీజేపీ ఎదగాలని ప్రయత్నం చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ప్రధాని మోదీని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యత్నించారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయానికి విజయసాయిరెడ్డి వెళ్లారు. ప్రధాని ఆఫీస్ దగ్గర ఉన్న విలేకరులను చూసి ఆయన బయటకు వెళ్లిపోయారు. విజయసాయిరెడ్డి వెంట ప్రతిపక్ష నేత జగన్ బంధువు వినీత్రెడ్డి పీఎంవోలోకి వెళ్లారు. వినీత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వీరిద్దరు ప్రధాని అపాయింట్మెంట్ కోసం గంట సేపు నిరీక్షించినట్లు సమాచారం.
చంద్రబాబు అనుమతి అవసరంలేదు- విజయసాయిరెడ్డి
Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: