రైతుల కన్నీరు రాష్టానికి అరిష్టం.. అన్నదాతలను ఆదుకోవాలి.
The bullet news ( Nellore ) _ రైతులకు గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ లో బిజేపీ ఆద్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు.. వడ్లను రోడ్డుమీద పారబోస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా బిజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు గిట్టుబాటు ధరలేక నష్టాల ఊబిలో కొట్టిమిట్లాడుతున్నారన్నారు.. రైతులను కంటతడి పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగుడ సాధించిన దాఖలాల్లేవన్నారు.. క్వింటా ధాన్యానికి రూ.300బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు..అలాగే మిల్లర్లను, దళారులను అరికట్టి వారి దోపిడి నుంచి రైతులను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..అనంతరం కలెక్టర్ ముత్యాల రాజుకు వినతిపత్రం అందజేశారు..
రైతుల కన్నీరు రాష్టానికి అరిష్టం.. అన్నదాతలను ఆదుకోవాలి.
Reviewed by ADMIN
on
March 05, 2018
Rating:
No comments: