Top Ad unit 728 × 90

ఉయ్యురు ప్రజలకు అందుబాటులో విజయలక్ష్మి సూపర్ మార్కెట్-ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్.

THE BULLET NEWS (VUYYUR)-ఉయ్యూరు నగర పంచాయతీ మరియు చుట్టూ ప్రక్కల గ్రామల ప్రజలకు క్వాలిటీ ప్యాకింగ్ తో నిత్యావసర సరుకులు అందించడమే లక్ష్యంగా సంవత్సరం క్రితం నీటి పారుదల శాఖా మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించిన విజయలక్ష్మి సూపర్ మార్కెట్ వారి మొదటి సంవత్సరం వేడుకలు ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కోగంటి మల్లికార్జునరావు ఆశీర్వాదంతో వారి కుమారులు కోగంటి శ్రీను మరియు కోగంటి లింగయ్య స్థాపించిన విజయలక్ష్మి సూపర్ మార్కెట్ మరింత దినదినాభివృద్ధి చెంది మరిని సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా మొదటి సంవత్సరం తమ దగ్గర ఎక్కువ సరుకులు కొన్న కస్టమర్లకు వెండి నాణాలు అందజేశారు. అలాగే ఇవ్వాల్టి నుంచి తమ దగ్గర సరుకులు కొన్నే కస్టమర్లకు వాటి విలువ ఆధారంగా 1 గ్రాము నుంచి 10 గ్రాముల వెండి నాణాలు అందజేస్తునట్లు తెలియ చేశారు.

ఈ కార్యక్రమంలో సి.డి.సి చైర్మన్ పిచ్చిరెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, కూనపరెడ్డి వాసు, వల్లయ్య, మానీక్యాలరావు, లక్ష్మణ, మస్తాను, బసివి రెడ్డి, బ్రహ్మం, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉయ్యురు ప్రజలకు అందుబాటులో విజయలక్ష్మి సూపర్ మార్కెట్-ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్. Reviewed by ADMIN on March 21, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.