గబ్బర్ సింగ్ అజ్ఞాతవాసిలా మారాడు - మంత్రి సోమిరెడ్డి కామెంట్
The bullet news ( Amaravathi) _ జనసేన అధినేత పవన్కల్యాణ్పై మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గబ్బర్సింగ్ కాస్త అజ్ఞాతవాసిలా మారిపోయారని వ్యాఖ్యానించారు. జగన్ తరహాలోనే పవన్ కల్యాణ్ కూడా మిస్డ్ కాల్ పార్టీల జాబితాలో చేరారా? వాళ్లను అనుసరిస్తున్నారా? అని ప్రశ్నించారు.
కాపు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న చంద్రబాబును విమర్శిస్తారా..? అని మంత్రి మండిపడ్డారు. ఆవేశంలో జరిగిన ఒకటి రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు, లోకేష్ను విమర్శించడానికే జేఎఫ్సీని ఏర్పాటు చేశారని మంత్రి సోమిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గబ్బర్ సింగ్ అజ్ఞాతవాసిలా మారాడు - మంత్రి సోమిరెడ్డి కామెంట్
Reviewed by ADMIN
on
March 16, 2018
Rating:
No comments: