Top Ad unit 728 × 90

రాజకీయ చిత్రపటంలో ఆయన స్థానం సుస్థిరం...

The bullet news ( Nellore )_  అస్పృశ్యతా నివారణ, షెడ్యూలు కులాల జనోద్ధరణ ఉద్యమాలలో అసమాన కార్య దక్షునిగా నిలిచి భారత దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని డాక్టరు బాబూ జగజ్జీవన్ రామ్ పొందారని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. జగజ్జీవన్ రాం 111 వ జయంతిని పురస్కరించుకుని కార్పోరేషను ఆధ్వర్యంలో స్థానిక వేదాయపాలెం కూడలిలోని ఆయన విగ్రహం వద్ద భారీ ఏర్పాట్లను గురువారం చేపట్టారు. కార్యక్రమానికి మేయరు హాజరై జగజ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజకీయ రంగంలో అర్ధ శతాబ్దానికి పైగా అగ్రశ్రేణి నేతగా శాసన సభ్యత్వం మొదలుకుని దేశ ఉప ప్రధాని వరకు ఎన్నో పదవులు అలంకరించిన ఘనత జగజ్జీవన్ రాంకు దక్కుతుందని తెలిపారు. జాతిపిత గాంధీజీ పిలుపుపై సత్యాగ్రహోద్యమంలో పాల్గొని ఎన్నో సార్లు లాఠీదెబ్బలు తిన్నారనీ, స్వాతంత్రోద్యమం తో పాటు దళిత సమాజ సంస్కరణ కార్యక్రమంలో అత్యంత చురుగు పాల్గొన్న నాయకులు జగజ్జీవన్ అని మేయరు వెల్లడించారు. ఏ పదవి చేపట్టినా సమర్ధవంతంగా నిర్వహించి, ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఆ పదవికే గౌరవం తెచ్చేలా ఆయన పనిచేశారని వివరించారు. అనంతరం టిడిపి కార్యాలయంలో నగర ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమలో పాల్గొని జగజ్జీవన్ చిత్రపటానికి మేయరు నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్భా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉత్సవ సభలో పాల్గొన్నారు. కలెక్టరు ముత్యాల రాజుతో కలిసి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి, జగజ్జీవన్ చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పు కళాకారుల బృంద ప్రదర్శనను మేయరు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు నూనె మల్లికార్జున, రాజా నాయుడు, నాయకులు కొండ్రెడ్డి రంగా రెడ్డి, షంషుద్దీన్, మౌలానా తదితరులు పాల్గొన్నారు
రాజకీయ చిత్రపటంలో ఆయన స్థానం సుస్థిరం... Reviewed by ADMIN on April 05, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.