సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ షా.. వైసీపీకి షాక్!
The Bullet News ( Hyderabad)_ ఆంధ్రప్రదేశ్ బీజేపీ విషయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి , బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను నియమించనున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలకు సమాచారం అందించారు. కాగా రెండు వారల కిందట లక్ష్మీనారాయణ బీజేపీని వీడి వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా అయన బీజేపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ నేతలు షాక్ లో మునిగిపోయారు. కాపు సామజిక వర్గం నుంచి పట్టున్న నేతను బీజేపీకి అధ్యక్షుడిని చేయడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో వారి ఓట్లను కొంత మేర తమవైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలోనే కన్నాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ షా.. వైసీపీకి షాక్!
Reviewed by ADMIN
on
May 14, 2018
Rating:
No comments: