Top Ad unit 728 × 90

నెల్లూరు జిల్లా వింజ‌మూరు కేంద్రంగా రెడ్ శ్యాండిల్ అక్ర‌మ ర‌వాణా.. పోలీసులు అదుపులో 15 మంది స్మ‌గ్ల‌ర్లు...

THE BULLET NEWS(NELLORE)-ఎర్రచందనం అక్రమ రవాణాకు అలవాటు పడ్డ ఎర్రదొంగల భరతం పడుతున్నారు నెల్లూరుజిల్లా ఎస్పీ పిహెచ్ డి రామక్రుష్ణ.. క్రైమ్ ఓఎస్డీ విఠలేశ్వర్ రావు నాయకత్వంలో పనిచేస్తున్న యాంటి రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్ దాడులు ముమ్మరం చేస్తుండటంతో ఎర్రదొంగలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. వింజమూరు కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా ఇవాళ పోలీసులు గుట్టు రట్టు చేశారు.. దాదాపు 15 మంది అంతర్రాష్ట, స్థానిక స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి కోట్ల విలువ చేసే 101 ఎర్రచందనం దుంగలను,ఒక రివాల్వర్, కంటైనర్ లారీ, రెండు కార్లు, మూడు బైక్స్ తో పాటు 18 సెల్ ఫోన్లు, రూ.16,180 నగదు స్వాధీనం చేసుకున్నారు.. జిల్లా ఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు..

నెల్లూరుజిల్లాలోని వింజమూరు, కలిగిరి, కావలి ప్రాంతాల్లో సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను గుట్టరట్టుచేశామన్నారు..ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ పోర్ప్ టీమ్ అద్బుతంగా పనిచేస్తోందన్నారు.. ఇప్పటి వరకు 20 కేసుల్లో 102 మందిని అరెస్టు చేసి ఏడు కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు.. భవిష్యత్ లో మరిన్ని ఆపరేషన్లు కొనసాగుతాయన్నారు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై పిడియాక్ట్ నమోదు చేసి ఆస్తులను సైతం జప్తు చేస్తామని ఆయన హెచ్చరించారు.. ఈ దాడుల్లో పాల్గొన్న ఆత్మకూరు, కావలి, వింజమూరు, కలిగిరి పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు..
నెల్లూరు జిల్లా వింజ‌మూరు కేంద్రంగా రెడ్ శ్యాండిల్ అక్ర‌మ ర‌వాణా.. పోలీసులు అదుపులో 15 మంది స్మ‌గ్ల‌ర్లు... Reviewed by ADMIN on September 30, 2017 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.