రొట్టెల పండుగకు చరిత్ర మీకు తెలుసా..
THE BULLET NEWS (NELLORE)-కులమతాలకు అతీతంగా..మతసారస్యానికి ప్రతీకగా నిలిచే పండుగ అది.. అక్కడ రొట్టె పట్టుకుంటే అన్ని పాపాలు హరించడంతో పాటు.. కోరిన కోర్కెలు ఫలిస్తాయన్నది భక్తుల నమ్మకం..అందుకే విశ్వాసానికి,నమ్మకానికి భక్తుల కొంగు బంగారంగా మారింది ఆ దర్గా.. వీరుల విజయ గాథకు నిలువుటద్దమైంది.. దేశ, విదేశాల్లో విశిష్టత కలిగిన నెల్లూరు బారాషహీద్ దర్గా ప్రాంగణంలో జరిగే రొట్టెల పండుగ పై ప్రత్యేక కథనం.
ప్రతి ఏటా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లిముల పండుగే
అయినా.. సర్వ మతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.. అంతే కాకుండా ఈ పండుగ వెనుక ఓ చారిత్రాత్మక కథనం కూడా దాగి ఉంది.
దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం మహ్మద్ ప్రవక్త అనుచరులు 12 మంది భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన పవిత్ర యుద్ధంలో భాగంగా ఆ పన్నెండు మంది వీర మరణం
పొందారు. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు నరకబడి అక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు చెరువు ఒడ్డుకు ఈ 12 మంది మొండాలను చెరువు వద్దనే సమాధి చేశారు.దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వీరికి బారాషహీద్ లుగా పేరు వచ్చింది.
అప్పట్లో తమిళనాడుకు చెందిన ఆర్కాట్ నవాబ్ భార్య అనారోగ్యంతో దీర్ఘకాలికంగా
బాధపడుతుండేది. అయితే దేశ వ్యాప్తంగా ఎంతో మంది వైద్యులు వైద్యం అందించినప్పటికీ రాణి ఆరోగ్యం కుదుటపడలేదు. ఆ సమయంలో రాణి కలలో ఈ బారాషహీద్ లు కనిపించి నెల్లూరు చెరువు ఒడ్డున తాము సమాధులైన విషయం తెలిపారట..వారికి దర్గా ఏర్పాటు చేయాలని ఆదేశించారట.. దాంతో అనారోగ్యంతో
బాధపడుతున్న ఆర్కాట్ నవాబ్ భార్యతో కలిసి బారాషహీద్ ల సమాధులైన ఈ ప్రాంతానికి వచ్చారు. బారాషహీద్లకు గుర్తింపు కలిగేలా పెద్ద దర్గాను నిర్మించి అక్కడే ఓ రాత్రి నిద్ర చేశారు. దీంతో అప్పటి వరకు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాణి ఆరోగ్యం కుదుట పడింది. అప్పటి వరకు పవిత్ర యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన వీరు కోరిన కోర్కెలు తీర్చే బారాషహీద్ లుగా పేరు ప్రఖ్యాతలు గాంచారు. అప్పట్లో నవాబు భార్య కోరిక
తీర్చడంతో అక్కడి చెరువులో రొట్టెలు వదిలే సంప్రదాయాన్ని కూడా అప్పటి నుంచే ప్రాచుర్యంలోకి వచ్చింది.
ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా ఇక్కడ రొట్టెల పండుగ కుల మతాలకు అతీతంగా.. భక్తి
విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. అప్పటి నుంచి భక్తుల ఈ బారాషహీదులను దర్శించి మొక్కలు
మొక్కడం...మొక్కలు తీరగానే ప్రతీ సంవత్సరం మొహరం మాసంలో జరిగే ఈ రొట్టెల పండుగ సమయంలో రొట్టెల రూపంలో మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా మారింది. కోర్కెలు తీరిని వారు గుర్తుగా ఈ దర్గా సమీపంలోని చెరువులో రొట్టె వదిలి మొక్కు చెల్లిస్తారు. అలాగే కొత్తగా కోర్కెలు కోరుకునే వారు వాటిని అందుకుని తమ మనోవాంఛ
తీరాలని మొక్కుకుంటారు. మొక్కిన వారి ఆకాంక్షలు తీరితే మరుసటి ఏడాది వచ్చి రొట్టెను వదులుతారు. ఇలా ఇక్కడి రొట్టెల పండుగ మన దేశంలోని ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర అనేక రాష్ట్రాలతో పాటు సౌదీ, అరబ్
దేశాలలో కూడా ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ రొట్టెల పండుగ హిందూ, ముస్లిం, క్రైస్తవ ల సఖ్యతకు చిహ్నంగా నిలిచే ఈ రొట్టెల పండుగ రేపటి నుంచి( అక్టోబర్ 1) ప్రారంభం కానుంది.
రేపటి నుంచి (అక్టోబర్ 1) ఐదో రోజులపాటు జరిగే ఈ పండుగ కోసం రాష్ట్ర పట్టణాభివ్రుద్ధి,
పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు మేయర్, కమిషనర్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. రొట్టెల పండుగ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు
సిద్ధమైంది. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.దాదాపు 16 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయంటూ అధికారులు అంచనా వేస్తున్నారు..
ప్రతి ఏటా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లిముల పండుగే
అయినా.. సర్వ మతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.. అంతే కాకుండా ఈ పండుగ వెనుక ఓ చారిత్రాత్మక కథనం కూడా దాగి ఉంది.
దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం మహ్మద్ ప్రవక్త అనుచరులు 12 మంది భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన పవిత్ర యుద్ధంలో భాగంగా ఆ పన్నెండు మంది వీర మరణం
పొందారు. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు నరకబడి అక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు చెరువు ఒడ్డుకు ఈ 12 మంది మొండాలను చెరువు వద్దనే సమాధి చేశారు.దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వీరికి బారాషహీద్ లుగా పేరు వచ్చింది.
అప్పట్లో తమిళనాడుకు చెందిన ఆర్కాట్ నవాబ్ భార్య అనారోగ్యంతో దీర్ఘకాలికంగా
బాధపడుతుండేది. అయితే దేశ వ్యాప్తంగా ఎంతో మంది వైద్యులు వైద్యం అందించినప్పటికీ రాణి ఆరోగ్యం కుదుటపడలేదు. ఆ సమయంలో రాణి కలలో ఈ బారాషహీద్ లు కనిపించి నెల్లూరు చెరువు ఒడ్డున తాము సమాధులైన విషయం తెలిపారట..వారికి దర్గా ఏర్పాటు చేయాలని ఆదేశించారట.. దాంతో అనారోగ్యంతో
బాధపడుతున్న ఆర్కాట్ నవాబ్ భార్యతో కలిసి బారాషహీద్ ల సమాధులైన ఈ ప్రాంతానికి వచ్చారు. బారాషహీద్లకు గుర్తింపు కలిగేలా పెద్ద దర్గాను నిర్మించి అక్కడే ఓ రాత్రి నిద్ర చేశారు. దీంతో అప్పటి వరకు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాణి ఆరోగ్యం కుదుట పడింది. అప్పటి వరకు పవిత్ర యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన వీరు కోరిన కోర్కెలు తీర్చే బారాషహీద్ లుగా పేరు ప్రఖ్యాతలు గాంచారు. అప్పట్లో నవాబు భార్య కోరిక
తీర్చడంతో అక్కడి చెరువులో రొట్టెలు వదిలే సంప్రదాయాన్ని కూడా అప్పటి నుంచే ప్రాచుర్యంలోకి వచ్చింది.
ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా ఇక్కడ రొట్టెల పండుగ కుల మతాలకు అతీతంగా.. భక్తి
విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. అప్పటి నుంచి భక్తుల ఈ బారాషహీదులను దర్శించి మొక్కలు
మొక్కడం...మొక్కలు తీరగానే ప్రతీ సంవత్సరం మొహరం మాసంలో జరిగే ఈ రొట్టెల పండుగ సమయంలో రొట్టెల రూపంలో మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా మారింది. కోర్కెలు తీరిని వారు గుర్తుగా ఈ దర్గా సమీపంలోని చెరువులో రొట్టె వదిలి మొక్కు చెల్లిస్తారు. అలాగే కొత్తగా కోర్కెలు కోరుకునే వారు వాటిని అందుకుని తమ మనోవాంఛ
తీరాలని మొక్కుకుంటారు. మొక్కిన వారి ఆకాంక్షలు తీరితే మరుసటి ఏడాది వచ్చి రొట్టెను వదులుతారు. ఇలా ఇక్కడి రొట్టెల పండుగ మన దేశంలోని ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర అనేక రాష్ట్రాలతో పాటు సౌదీ, అరబ్
దేశాలలో కూడా ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ రొట్టెల పండుగ హిందూ, ముస్లిం, క్రైస్తవ ల సఖ్యతకు చిహ్నంగా నిలిచే ఈ రొట్టెల పండుగ రేపటి నుంచి( అక్టోబర్ 1) ప్రారంభం కానుంది.
రేపటి నుంచి (అక్టోబర్ 1) ఐదో రోజులపాటు జరిగే ఈ పండుగ కోసం రాష్ట్ర పట్టణాభివ్రుద్ధి,
పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు మేయర్, కమిషనర్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. రొట్టెల పండుగ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు
సిద్ధమైంది. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.దాదాపు 16 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయంటూ అధికారులు అంచనా వేస్తున్నారు..
రొట్టెల పండుగకు చరిత్ర మీకు తెలుసా..
Reviewed by ADMIN
on
September 30, 2017
Rating:
No comments: