వెంకటగిరి మునిసిపల్ కౌన్సిలర్ శంకరయ్య మృతి
THE BULLET NEWS (VENKATAGIRI)-వెంకటగిరి మునిసిపాల్టీ ఏడో వార్డు మెంబర్ మచ్చల శంకరయ్య ఇవాళ ఉదయం కన్ను మూశారు.. గత కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న శంకరయ్య చెన్నయ్ లో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.. దీంతో ఏడోవార్డులో విషాద చాయలు అలుముకున్నాయి.. గతంలో నెల్లూరులోని రెయిన్ బో చికిత్స పొందుతున్న సమయంలో శంకరయ్యను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ,మునిసిపల్ చైర్ పర్సన్ పరామర్శించి ఆర్దికసాయం అందజేశారు.. రెయిన్ బో లో ఉన్న సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చెన్నయ్ లోని ఓ ప్రయివేట్ వైద్యశాలకు తరలించారు.. చికి్త్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.. శంకరయ్య కుటుంబానికి ఎమ్మెల్యే, మునిసిపల్ చైర్ పర్సన్, టీడీపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..
వెంకటగిరి మునిసిపల్ కౌన్సిలర్ శంకరయ్య మృతి
Reviewed by ADMIN
on
October 01, 2017
Rating:
No comments: