టీడీపీ హయాంలోనే క్రీడలకు అధిక ప్రాధాన్యత - ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్
THE BULLET NEWS (KRISHNA)-నందమూరి తారకరామారావు పురిటిగడ్డ గుడివాడలో రాష్ట స్థాయి క్రీడాపోటీలు జరగడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.. ఇవాళ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో క్రీడల అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీయార్ స్టేడియంలో జరుగుతన్న ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమన్నారు.. క్రీడాకారులందరూ మంచి ప్రతిభను కనబరుస్తూ రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు , తూర్పు డెల్టా నీటి సంఘం అధ్యక్షులు గుత్తా శివరామకృష్ణ , స్టేడియం పాలక వర్గ అధ్యక్షులు , తెదేపా నాయకులు కొండా ప్రవీణ్ కుమార్ , ఎమ్ రాఘవేంద్రప్రసాద్ , మరీదు హరిబాబు ,డి.నాగభూషణం , వల్లూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు .
టీడీపీ హయాంలోనే క్రీడలకు అధిక ప్రాధాన్యత - ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్
Reviewed by ADMIN
on
September 29, 2017
Rating:
No comments: