2019లో కూడా మాదే అధికారం - గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్
The bullet news ( Gudur)- ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజా సమస్యలను పరిష్కరించగలిగే అవకాశం దక్కిందని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు.. ఇవాళ చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు.. దాదాపు 36లక్షల రూపాయలతో చేసిన వివిధ అభివృద్ది పనులను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు.. ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కారం చూపడానికే ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించారన్నారు.. ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.. ప్రజల స్పందన చూస్తుంటే 2019 లో ఖచ్చింగా టీడీపీ విజయదుందుభి మోగించడం ఖాయంగా కనిపిస్తోందన్నారు.. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ్ బాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
2019లో కూడా మాదే అధికారం - గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్
Reviewed by ADMIN
on
September 29, 2017
Rating:
No comments: