ఉద్యమాలతో ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం - ఏపీ వాల్మీకి జేఎసీ
The bullet news (Kurnool)- "ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కోసం ఇప్పటి వరకు ఎదురుచూశాం.. మరోసారి మోసపోయేలా ఉన్నాం.. మేల్కొందాం.. ఉద్యమిద్దాం.. పోరాటాల ద్వారా ఎస్టీ పునరుద్దరణ సాధించుకుందాం.. వాల్మీకుల దెబ్బేంటో ప్రభుత్వానికి తెలిసేలా చేద్దాం అంటూ" ఏపీ వాల్మీకీ జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవాధ్యక్షులు శ్రీగిరి ఆదిశేషయ్య పిలుపునిచ్చారు.. కర్నూల్ రాజ్ విహార్ సెంటర్ లోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన వాల్మీకుల ఎస్టీ సంకల్ప దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూల్ జిల్లా నుంచే గాక వివిధ జిల్లాల నుంచి వాల్మీకి యువత భారీగా పాల్గొన్నారు.. మొదట నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ భవన్ లో సభ ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పోరాటాల ద్వారానే వాల్మీకుల చిరకాల వాంఛ తీరుతుందన్నారు.. తెలుగుదేశం ప్రభుత్వం మేనిపెస్టోలో చేర్చిన విధంగా వాల్మీకులను ఎస్టీల్లో చేర్చకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని వారు హెచ్చరించారు.. రానున్న రోజుల్లొ ఉద్యమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.. అందులో భాగంగా జేఏసీ కమిటిని వారు ఎన్నుకున్నారు.. గౌరవాధ్యక్షులుగా శ్రిగిరి ఆదిశేషయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. కన్వీనర్లుగా కుప్పటి కృష్ణయ్య, తలారి కృష్ణయ్య నాయుడు, బోయ విష్ణు, గుడిసే సీతారాముడులను ఎన్నుకున్నారు..
ఉద్యమాలతో ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం - ఏపీ వాల్మీకి జేఎసీ
Reviewed by ADMIN
on
September 25, 2017
Rating:
No comments: