అవినీతిలో అబ్బాకొడుకులకు ధీటుగా మండల స్థాయి నేతలు - కాకాణి విమర్శ
The bullet news (Nellore)- అబ్బా కొడుకులు రాష్టాన్ని దోచుకుంటుంటే వారిని స్ఫూర్తిగా తీసుకున్న క్షేత్ర స్థాయి టీడీపీ నాయకులు గిరిజనుల సొమ్మును లాక్కొన్ని వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. .వెంకటాచలం మండలం గుడ్లూరివారిపాళెం గిరిజనులను వెంటబెట్టుకుని గ్రీవెన్స్ లో జేసి ఇంతియాజ్ కు వినతిపత్రం అందజేశారు.. ఎస్టీ రుణాల మంజూరులో సబ్సిడి సొమ్ము రూ.90వేలను దళితులకు ఇవ్వకుండా వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్న మంత్రి సోమిరెడ్డి అనుచరుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష రూపాయల లోను అయితే దానిలో రూ.90వేలు సదరు టీడీపీ నేత నొక్కేసి రూ.10వేలు మాత్రమే దళితులను ఇచ్చారని ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురుతిరిగితే చంపేస్తానంటూ దళితులను బెదిరిస్తున్నాడని ఆయన వివరించారు.. తెలుగుదేశం ప్రభుత్వానికి దళితులంటే మొదటి నుంచి చిన్నచూపేనన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దగ్గర నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి దాకా ప్రతి ఒక్కరూ దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేసినవారేనని ఆయన గుర్తు చేశారు.. పాలనలో సైతం దళితులను తెలుగుదేశం ప్రభుత్వం మోసగిస్తోందని మండిపడ్డారు.. మంత్రి సోమిరెడ్డి అండదండలతో దళితులను క్షేత్రస్థాయి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. దళితులను సొమ్మును నొక్కేసిన నేతపై చర్యలు తీసుకొని బ్యాంకు అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అవినీతిలో అబ్బాకొడుకులకు ధీటుగా మండల స్థాయి నేతలు - కాకాణి విమర్శ
Reviewed by ADMIN
on
September 25, 2017
Rating:
No comments: