తిరుపతిలో వాల్మీకి దేవాలయం ధ్వంసం - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాల్మీకి నాయకులు
The bullet news (Tirupathi)- వాల్మికీ ఉద్యమాలకు రూపం దిద్దుకున్న చోట విధ్వంసం జరిగింది..వాల్మీకి జాతి అత్మగౌరవాన్ని తిరుపతి మునిసిపల్ అధికారులు దెబ్బతీశారు.. ఎన్నో ఆలోచనలకు నాంది పలికిన చోట, మహానీయులు నడియాడిన నేలమీద అమానుషం చోటు చేసుకుంది.. తిరుపతిలో వాల్మీకి మహర్షి దేవాలయాన్ని ధ్వంసం చేశారు మునిసిపల్ అధికారులు. తిరుపతిలోని కపిలతీర్దానికి కూతవేటు దూరంలో మాల్వాడిగుండం లో శ్రీ సీతారామలక్ష్మణ సమేత వాల్మీకి మహర్షి దేవాలయం ఎన్నో ఏళ్లుగా వాల్మీకి బోయల చేత పూజలందుకుంటోంది.. ఆ స్థలం దురాక్రమణకు గురైందనే సాకుతో కొందరు కోర్టుకెళ్లారు.. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో కొనసాతుంది.. ఈ ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు జరపకూడదంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో వాల్మీకులు ఎలాంటి నిర్మాణాలు జరపలేదు.. కానీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిన్న పట్టపగలు దేవాలయాన్ని కూలదోశారు.. మునిసిపల్ అధికారులు నోటీసులు ఇవ్వకుండా దేవాలయాన్ని ధ్వంసం చేయడంపై వాల్మీకి జాతి ఆగ్రహంతో ఉంది.. వాల్మీకి దేవాలయాన్ని ద్వంసం చేయడం వాల్మీకి జాతిపై దాడి అని వాల్మికీ నాయకులు మండిపడుతున్నారు..ఇందుకు నిరసనగా ఉద్యమానికి వాల్మీకులు సిద్దమవుతున్నారు.. దేవాలయాన్ని వెంటనే పునరుద్ధరించి వాల్మీకి బోయలకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు..
తిరుపతిలో వాల్మీకి దేవాలయం ధ్వంసం - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాల్మీకి నాయకులు
Reviewed by ADMIN
on
September 22, 2017
Rating:
No comments: