సామాన్యుల ఆర్ధిక ప్రగతికి బ్యాంకులు తోడ్పాటునందించాలి - మంత్రి నారాయణ
The bullet news (Nellore)- బ్యాంకులు సామాన్యుల ఆర్థిక ప్రగతికి తోడ్పాటునందించాలని రాష్ట పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరు లో గోదావరి అర్బన్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల స్వయం సమృద్ధి కి ప్రతి బ్యాంకు సామాజిక బాధ్యతగా ఋణాలు అందజేయాలన్నారు.. బ్యాంకు వ్యవస్థాపకులు హేమంత్ పాటిల్ మాట్లాడుతూ ఎపిలో అరవై బ్రాంచీల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రస్తుతం నలభై రెండుశాఖలను ఏర్పాటు చేశామన్నారు.. ప్రస్తుతం దేశవ్యాపితంగా వెయ్యి కోట్ల టర్నోవర్ తో రెండున్నర లక్షల సభ్యుల్ని కల్గి ఉన్నామన్నారు...బ్యాంకు డిపాజిట్లలో 70 మొత్తం స్థానికులకే రుణాలుగా అందిస్తామన్నారు. పట్టణాల్లో చిరువ్యాపారులు కు రెండు లక్షల వరకు హామీలేని ఋణాలు గోదావరి బ్యాంకు లక్ష్యమని ఆయన్నారు.. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్ పర్సన్ రాజశ్రీ హేమంత్ , జడ్పీ చైర్మన్ జడ్పి ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవెంద్రరెడ్డి . తదితరులు పాల్గొన్నారు..
సామాన్యుల ఆర్ధిక ప్రగతికి బ్యాంకులు తోడ్పాటునందించాలి - మంత్రి నారాయణ
Reviewed by ADMIN
on
October 01, 2017
Rating:
No comments: