ప్రకృతి సంపద స్వాహా..!
The bullet news(doravarisatrm)-జిల్లా పొరుగున ఉన్న తమిళనాడుకు అక్రమ మార్గాల్లో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా ఈ తంతు ఆగడం లేదు. రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతమైన చెన్నైలో ఇసుకకు మంచి డిమాండు ఉంది. ఇసుక రవాణాదారులు వివిధ రకాలుగా గిమ్మిక్కులు ప్రదర్శించి తమ పని చక్కబెట్టుకుంటున్నారు. ఒక నిర్థిష్టమైన పద్ధతి లేేకపోవడంతో పోలీసులు కూడా తమకు ఇష్టమొచ్చినట్లుగా ఒక్కో మండలంలో ఒక్కో రీతిలో వ్యవహరిస్తున్నారు. సాంకేతికతను వినియోగించి తనిఖీలు చేసి పట్టుకునే వీలున్నా ఆదిశగా ఎటువంటి చర్యలు కనిపించడం లేదు. తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణా అంశం పక్కనబెడితే.. స్థానికంగా పెద్ద పెద్ద గుత్తేదారు సంస్థలు సేకరిస్తున్న ఇసుక విషయంలోనూ ఒక విధానమంటూ లేకుండాపోయింది.
నాయుడుపేట మండలం బిరదవాడ వద్ద ప్రభుత్వం 2740 మంది నిరుపేదలకు గృహ సదుపాయం కల్పించేందుకు పెద్ద సంస్థకు పనులు అప్పగించింది. ఇందులో భాగంగా ఇక్కడ అపార్టుమెంట్లు నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఈ గుత్తేదారు సంస్థ ఇక్కడి అవసరాలకు అధికారులు గుర్తించిన నెల్లూరు ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలించుకోవాల్సి ఉంది. కానీ నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల నుంచి భారీగా ఇసుకను తరలించుకుపోతున్నారు. నాయుడుపేట మండలం బురదమడుగు వద్దనున్న మామిడికాల్వ నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తరలింపులు జరుపుతున్నాయి. వీటిపై రైతులు అభ్యంతరం చెబుతున్నా పోలీసులు కట్టడి చేయడం లేదు. అదేవిధంగా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు సమీపంలో నదిలో దారి సదుపాయం కల్పించుకుని మరీ ఇసుక తరలిస్తున్నారు. చావాలి నుంచి అదే పరిస్థితి. ఇక గ్రామాల పరిధిలో స్వర్ణముఖినది నుంచి ఎక్కడ అవకాశముంటే అక్కడ నుంచి కొల్లగొడుతున్నారు. పోలీసులకు నెలమామూళ్లు మాట్లాడుకుని ఈ వ్యవహారం నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే మామూళ్లు ఇవ్వనివారిని పోలీసులు తనిఖీల పేరుతో పట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారు. నెలమామూళ్లు ఇచ్చే ఇసుకాసురులు రాజకీయ నాయకుల ద్వారా రెవెన్యూ, పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇసుక తరలింపులు జరిగేలా చేస్తున్నారు.
* ఒక్కో ట్రాక్టరుకు రూ.1500 చెల్లింపు : బిరదవాడ వద్ద అపార్టుమెంట్లు నిర్మించే భవన నిర్మాణ సంస్థ నెల్లూరు నుంచి ఇసుక తెచ్చుకుంటే భారీగా ఖర్చు అవుతుంది. అందుకని ఇక్కడి రాజకీయ నాయకులు, ట్రాక్టరు యజమానులను మచ్చిక చేసుకొని నది నుంచి ఇసుకను తరలింపులు చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఒక ఇసుక ట్రాక్టరుకు వారు రూ.1500 వరకు చెల్లిస్తుండటంతో ఇలా కొన్ని పదుల సంఖ్యలో ట్రాక్టర్లు నిత్యం తిరుగుతూనే ఉంటున్నాయి. ఈ గుత్తేదారు సంస్థ వద్దకు ఇసుక తోలుతున్న ట్రాక్టర్లపై పోలీసుల చర్యలు ఏమీ కనిపించవు. స్థానిక అవసరాలకు తోలే ట్రాక్టర్లను మాత్రం కాపుకాచి పట్టుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద నదిలో కొన్ని నెలలు కిందట ఇసుక రవాణాదారులు జేసీబీతో బాట వేసేందుకు పనులు చేస్తూ తాగునీటి పథకం పైపులైన్లను ధ్వంసం చేశారు. నదిలో ట్రాక్టర్ల రాకపోకలకు అనువుగా చదును చేస్తూ తాగునీటి పథకాల పైపులైన్లను చెడగొట్టారు. దీంతో వారం రోజుల పాటు మూడు నాలుగు గ్రామాలకు నీరు సరఫరా కాలేదు. అలాగే గ్రామం వద్ద స్వర్ణముఖినది నుంచి ఇసుక తరలింపులు జరిపేందుకు ఇసుక రవాణాదారులు సొంతంగా నగదు ఖర్చు చేసి యంత్రాలతో గ్రావెల్, బూడిద, మట్టి తోలి రోడ్డు సదుపాయం కల్పించుకున్నారు. దీని వెనుకు ఎవరు ఉన్నారన్నది ఎవరికైనా ఇట్టే అర్ధమై పోతుంది.
* పెళ్లకూరు మండలం పెన్నేపల్లి, తాళ్వాయిపాడు వద్ద స్వర్ణముఖినది పొర్లుకట్టను సైతం ఇసుకాసురులు వంచేశారు. నదిలోకి దిగేందుకు పొర్లుకట్ట అడ్డంకిగా మారవడంతో నదిలోకి దిగేందుకు అనువుగా కట్టను ఏటవాలుగా చేసి ఇసుక రవాణా చేపట్టారు. ఇలా కట్టను తోసేసినా స్వర్ణముఖినది పొర్లుకట్ట పర్వవేక్షణ అధికారులు పట్టంచుకోలేదు.
* ఓజిలి మండలం జ్యోషులవారికండ్రిగ స్వర్ణముఖినది, మానవాల, ఓజిలి గ్రామాల పరిధిలోని మామిడి కాల్వ నుంచి రోజుకు 30 నుంచి 50 ట్రాక్టర్లు ఇసుకను బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని పెదపరియ నుంచి గూడూరుకు తీసుకెళ్తున్నారు.మేనకూరు నుంచి వెంకటగిరికి, కంపెనీల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది.
* పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఐదు రోజుల కిందట ఇసుక ట్రాక్టరులో స్థానిక అవసరాలకు తరలిస్తుండగా స్థానిక ఎస్సై పట్టుకున్నారు. ట్రాక్టరును ఎస్సై తహసీల్దారుకు అప్పగించడంతో కేసు నమోదు చేసేందుకు సమాయత్తం అయ్యారు. దీంతో స్థానికులు జోక్యం చేసుకొని ఏం తప్పు చేశారో చెప్పండని నిలదీస్తే తర్వాత వదిలేశారు.
* నాయుడుపేట నుంచి అన్నమేడుకు వెళ్లే జాతీయ రహదారి మలుపులో నెల రోజుల కిందట అర్థరాత్రి ఇసుక ట్రాక్టరును ఆర్టీసీ బస్సు ఢీకొని పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడ ట్రాక్టరు డ్రైవరు కనిపించలేదు. అతని గురించి పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. ప్రమాదం జరిగిన చోట నుంచి దెబ్బతిన్న ట్రాక్టరును కొన్ని గంటల వ్యవధిలోనే తీసుకెళ్లారు. ట్రాక్టరు యజమాని, సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ఆర్టీసీ బస్సు కండెక్టరును పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నాయుడుపేట మండలం బిరదవాడ వద్ద అపార్టుమెంట్లు నిర్మిస్తున్న గుత్తేదారు సంస్థ స్థానికంగా ఇసుక సేకరించకూడదు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు నెల్లూరు నుంచి ఇసుక తెచ్చుకోవాల్సిఉంది. ఇక్కడి నుంచి సేకరించి నిల్వలు చేయడంపై ఆ సంస్థకు హెచ్చరికలు జారీ చేశాం. స్థానికంగా ఎక్కడబడితే అక్కడ ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. గ్రామాల ప్రజలు మాకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇసుక తరలింపు సమస్యగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణముఖినది నుంచి ఇసుక తరలింపులు చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం.
* సూళ్లూరుపేట పోలీసులు ఇటీవల తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. దొరవారిసత్రం నుంచి ఇసుక ట్రాక్టర్లలో ఒకచోటకు తరలించి అక్కడి నుంచి లారీకి నింపి చెన్నైకు పల్లెలు మీదుగా తరలిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తరలింపుదారులపై చర్యలు చేపట్టారు.
* దొరవారిసత్రం మండలం తనియాలి వద్ద కాళంగి నంది నుంచి ఇసుకను ట్రాక్టరులో తరలిస్తుండగా వారం రోజుల కిందట పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. స్థానిక అవసరాలకు తరలించే ట్రాక్టర్లలను పట్టుకుని కేసులు పెట్టి అపరాధం వేసేలా చేస్తున్నారు. ఇసుక ఉచితంగా ఎక్కడినుంచైనా తరలించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అయితే పోలీసులు ఎందుకు పట్టుకున్నారో అర్థం కావడం లేదు. ఇష్టమైతే ఒకలా ఇష్టం లేకపోతో మరోలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నది ప్రజల అభియోగం.
* నాయుడుపేట మండలం కలిపేడు పంచాయతీ బురదమడుగు వద్ద మామిడికాల్వ నుంచి రోజూ 20, 30 ట్రాక్టర్లతో ఇసుక తరలింపులు జరుగుతున్నాయి.ఈ కాల్వలో ఫిల్టర్పాయింట్లు వేసుకుని పంటలు సాగు చేసుకునే రైతులు ఇసుక ఎత్తేస్తున్నారని సమాచారం ఇస్తే.. అక్కడికి పోలీసులు పోయేసరికి ఒక్క ట్రాక్టరు కూడా ఉండదు. ఇలా ఎన్నిసార్లు పోలీసులకు సమాచారం తెలిపినా వారు నామమాత్రంగా అక్కడికి వెళ్లి ఏమీ లేవని తిరిగి వచ్చేయడం సాధారణమైంది.
నాయుడుపేట మండలం బిరదవాడ వద్ద ప్రభుత్వం 2740 మంది నిరుపేదలకు గృహ సదుపాయం కల్పించేందుకు పెద్ద సంస్థకు పనులు అప్పగించింది. ఇందులో భాగంగా ఇక్కడ అపార్టుమెంట్లు నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఈ గుత్తేదారు సంస్థ ఇక్కడి అవసరాలకు అధికారులు గుర్తించిన నెల్లూరు ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలించుకోవాల్సి ఉంది. కానీ నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల నుంచి భారీగా ఇసుకను తరలించుకుపోతున్నారు. నాయుడుపేట మండలం బురదమడుగు వద్దనున్న మామిడికాల్వ నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తరలింపులు జరుపుతున్నాయి. వీటిపై రైతులు అభ్యంతరం చెబుతున్నా పోలీసులు కట్టడి చేయడం లేదు. అదేవిధంగా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు సమీపంలో నదిలో దారి సదుపాయం కల్పించుకుని మరీ ఇసుక తరలిస్తున్నారు. చావాలి నుంచి అదే పరిస్థితి. ఇక గ్రామాల పరిధిలో స్వర్ణముఖినది నుంచి ఎక్కడ అవకాశముంటే అక్కడ నుంచి కొల్లగొడుతున్నారు. పోలీసులకు నెలమామూళ్లు మాట్లాడుకుని ఈ వ్యవహారం నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే మామూళ్లు ఇవ్వనివారిని పోలీసులు తనిఖీల పేరుతో పట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారు. నెలమామూళ్లు ఇచ్చే ఇసుకాసురులు రాజకీయ నాయకుల ద్వారా రెవెన్యూ, పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇసుక తరలింపులు జరిగేలా చేస్తున్నారు.
* ఒక్కో ట్రాక్టరుకు రూ.1500 చెల్లింపు : బిరదవాడ వద్ద అపార్టుమెంట్లు నిర్మించే భవన నిర్మాణ సంస్థ నెల్లూరు నుంచి ఇసుక తెచ్చుకుంటే భారీగా ఖర్చు అవుతుంది. అందుకని ఇక్కడి రాజకీయ నాయకులు, ట్రాక్టరు యజమానులను మచ్చిక చేసుకొని నది నుంచి ఇసుకను తరలింపులు చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఒక ఇసుక ట్రాక్టరుకు వారు రూ.1500 వరకు చెల్లిస్తుండటంతో ఇలా కొన్ని పదుల సంఖ్యలో ట్రాక్టర్లు నిత్యం తిరుగుతూనే ఉంటున్నాయి. ఈ గుత్తేదారు సంస్థ వద్దకు ఇసుక తోలుతున్న ట్రాక్టర్లపై పోలీసుల చర్యలు ఏమీ కనిపించవు. స్థానిక అవసరాలకు తోలే ట్రాక్టర్లను మాత్రం కాపుకాచి పట్టుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద నదిలో కొన్ని నెలలు కిందట ఇసుక రవాణాదారులు జేసీబీతో బాట వేసేందుకు పనులు చేస్తూ తాగునీటి పథకం పైపులైన్లను ధ్వంసం చేశారు. నదిలో ట్రాక్టర్ల రాకపోకలకు అనువుగా చదును చేస్తూ తాగునీటి పథకాల పైపులైన్లను చెడగొట్టారు. దీంతో వారం రోజుల పాటు మూడు నాలుగు గ్రామాలకు నీరు సరఫరా కాలేదు. అలాగే గ్రామం వద్ద స్వర్ణముఖినది నుంచి ఇసుక తరలింపులు జరిపేందుకు ఇసుక రవాణాదారులు సొంతంగా నగదు ఖర్చు చేసి యంత్రాలతో గ్రావెల్, బూడిద, మట్టి తోలి రోడ్డు సదుపాయం కల్పించుకున్నారు. దీని వెనుకు ఎవరు ఉన్నారన్నది ఎవరికైనా ఇట్టే అర్ధమై పోతుంది.
* పెళ్లకూరు మండలం పెన్నేపల్లి, తాళ్వాయిపాడు వద్ద స్వర్ణముఖినది పొర్లుకట్టను సైతం ఇసుకాసురులు వంచేశారు. నదిలోకి దిగేందుకు పొర్లుకట్ట అడ్డంకిగా మారవడంతో నదిలోకి దిగేందుకు అనువుగా కట్టను ఏటవాలుగా చేసి ఇసుక రవాణా చేపట్టారు. ఇలా కట్టను తోసేసినా స్వర్ణముఖినది పొర్లుకట్ట పర్వవేక్షణ అధికారులు పట్టంచుకోలేదు.
* ఓజిలి మండలం జ్యోషులవారికండ్రిగ స్వర్ణముఖినది, మానవాల, ఓజిలి గ్రామాల పరిధిలోని మామిడి కాల్వ నుంచి రోజుకు 30 నుంచి 50 ట్రాక్టర్లు ఇసుకను బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని పెదపరియ నుంచి గూడూరుకు తీసుకెళ్తున్నారు.మేనకూరు నుంచి వెంకటగిరికి, కంపెనీల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది.
* పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఐదు రోజుల కిందట ఇసుక ట్రాక్టరులో స్థానిక అవసరాలకు తరలిస్తుండగా స్థానిక ఎస్సై పట్టుకున్నారు. ట్రాక్టరును ఎస్సై తహసీల్దారుకు అప్పగించడంతో కేసు నమోదు చేసేందుకు సమాయత్తం అయ్యారు. దీంతో స్థానికులు జోక్యం చేసుకొని ఏం తప్పు చేశారో చెప్పండని నిలదీస్తే తర్వాత వదిలేశారు.
* నాయుడుపేట నుంచి అన్నమేడుకు వెళ్లే జాతీయ రహదారి మలుపులో నెల రోజుల కిందట అర్థరాత్రి ఇసుక ట్రాక్టరును ఆర్టీసీ బస్సు ఢీకొని పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడ ట్రాక్టరు డ్రైవరు కనిపించలేదు. అతని గురించి పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. ప్రమాదం జరిగిన చోట నుంచి దెబ్బతిన్న ట్రాక్టరును కొన్ని గంటల వ్యవధిలోనే తీసుకెళ్లారు. ట్రాక్టరు యజమాని, సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ఆర్టీసీ బస్సు కండెక్టరును పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నాయుడుపేట మండలం బిరదవాడ వద్ద అపార్టుమెంట్లు నిర్మిస్తున్న గుత్తేదారు సంస్థ స్థానికంగా ఇసుక సేకరించకూడదు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు నెల్లూరు నుంచి ఇసుక తెచ్చుకోవాల్సిఉంది. ఇక్కడి నుంచి సేకరించి నిల్వలు చేయడంపై ఆ సంస్థకు హెచ్చరికలు జారీ చేశాం. స్థానికంగా ఎక్కడబడితే అక్కడ ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. గ్రామాల ప్రజలు మాకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇసుక తరలింపు సమస్యగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణముఖినది నుంచి ఇసుక తరలింపులు చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం.
* సూళ్లూరుపేట పోలీసులు ఇటీవల తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. దొరవారిసత్రం నుంచి ఇసుక ట్రాక్టర్లలో ఒకచోటకు తరలించి అక్కడి నుంచి లారీకి నింపి చెన్నైకు పల్లెలు మీదుగా తరలిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తరలింపుదారులపై చర్యలు చేపట్టారు.
* దొరవారిసత్రం మండలం తనియాలి వద్ద కాళంగి నంది నుంచి ఇసుకను ట్రాక్టరులో తరలిస్తుండగా వారం రోజుల కిందట పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. స్థానిక అవసరాలకు తరలించే ట్రాక్టర్లలను పట్టుకుని కేసులు పెట్టి అపరాధం వేసేలా చేస్తున్నారు. ఇసుక ఉచితంగా ఎక్కడినుంచైనా తరలించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అయితే పోలీసులు ఎందుకు పట్టుకున్నారో అర్థం కావడం లేదు. ఇష్టమైతే ఒకలా ఇష్టం లేకపోతో మరోలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నది ప్రజల అభియోగం.
* నాయుడుపేట మండలం కలిపేడు పంచాయతీ బురదమడుగు వద్ద మామిడికాల్వ నుంచి రోజూ 20, 30 ట్రాక్టర్లతో ఇసుక తరలింపులు జరుగుతున్నాయి.ఈ కాల్వలో ఫిల్టర్పాయింట్లు వేసుకుని పంటలు సాగు చేసుకునే రైతులు ఇసుక ఎత్తేస్తున్నారని సమాచారం ఇస్తే.. అక్కడికి పోలీసులు పోయేసరికి ఒక్క ట్రాక్టరు కూడా ఉండదు. ఇలా ఎన్నిసార్లు పోలీసులకు సమాచారం తెలిపినా వారు నామమాత్రంగా అక్కడికి వెళ్లి ఏమీ లేవని తిరిగి వచ్చేయడం సాధారణమైంది.
ప్రకృతి సంపద స్వాహా..!
Reviewed by ADMIN
on
February 26, 2018
Rating:
No comments: