అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు మహిళలు
The bullet news(crime)-కాస్టంలో బూడిద ఎత్తుకెళ్తున్నారని పెద్దపల్లి మండలం రాగినేడులో ముగ్గురు మహిళలకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. రాగినేడు గ్రామానికి చెందిన సొమిశెట్టి లక్ష్మి అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం మృతి చెందగా అదే రోజు గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. ఆచారం ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేం ద్రానికి చెందిన ముగ్గురు మ హిళలు సమ్మక్క, సారక్క, మ యిభాలు కాస్టం వద్ద బూడిద, ఎముకలు ఎత్తి సంచుల్లో నింపుతుండగా గ మనించిన రైతులు లక్ష్మి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆటోలో సంచులు వేసుకొని వెళ్తుండగా గ్రామంలో వారిని అడ్డుకున్నారు.
బూడిదను ఎందుకు తీసుకెళ్తున్నార ని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇచ్చారు. క్షుద్రపూజలు చేసేందుకే కాస్టంలో బూడిదను తీసుకెళుతున్నారని ఆగ్రహించిన కుటుంబసభ్యులు, గ్రామస్థులు వారిపై దాడికి దిగారు. శ్మశాన వాటికల్లో తిరిగి తాము బూడిద, ఎముకలను తీసుకెళతామని, వాటిని కడిగితే అందులోముక్కు పుడుకలు దొరుకుతాయనే ఆశతో ఇలా చేస్తున్నామని ముగ్గురు మహిళలు పేర్కొన్నారు. గ్రామస్థులు ఆటోను తనిఖీ చేయగా అందులో పెద్ద సంఖ్యలో నిమ్మకాయలు లభించాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు మహిళలు
Reviewed by ADMIN
on
February 26, 2018
Rating:
No comments: