నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసిబి అధికారులు ఆకస్మిక తనిఖీలు
THE BULLET NEWS (NELLORE)-అవినీతికి, అక్రమార్జనకు, ప్రవైట్ వ్యక్తులకు అడ్డాగా మారిన నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసిబి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.. ప్రవైట్ వ్యక్తులు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ రెడ్డి కి నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు.. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. లెక్క చూపని రూ.76వేల నగదుని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.. ఏసీబీ డీఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించామని, తమ అదుపులో ఉన్న వ్యక్తులను విచారించి ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరుపుతామన్నారు.. ఈ దాడుల్లో సిఐ శివ కుమార్ ఉన్నారు..
నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసిబి అధికారులు ఆకస్మిక తనిఖీలు
Reviewed by ADMIN
on
February 26, 2018
Rating:
No comments: