ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం
The bullet news ( Muthukuru) _ ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో కాంట్రాక్టు కార్మికుల నిరసన దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి.. సమాన పనికి సమాన వేతనం తో పాటు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ జెన్కో ఉద్యోగులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి.. ఇవాళ వాళ్ళ దీక్షలకు బిజెపి, జనసేన నాయకులు మద్దతు తెలిపారు.. బీజేపీ నాయకులు మాట్లాడుతూ జెన్కో కార్మికుల న్యాయ పరమైన కోరికలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. ఐక్య వేదిక అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ తమ సహనాన్ని ప్రభుత్వం చేతగానితనంగా భావిస్తోందన్నారు.. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆమరణ నిరాహారదీక్ష కు సైతం దిగుతామని హెచ్చరించారు..
ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం
Reviewed by ADMIN
on
February 26, 2018
Rating:
No comments: