కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రాజీనామా చేయాలి - విద్యార్ది జేఎసీ డిమాండ్
The bullet news (Nellore)- ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ నెల్లూరుజిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని రైల్వేస్టేషన్ ఎదుట ఆంద్రప్రదేశ్ యువజన మరియు విద్యార్ది జేఎసీ ధర్నా నిర్వహించారు.. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఏపీ ప్రజల మనోభావాలను గుర్తించి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. ఏపీకి ప్రత్యేకహోదా పదిహేనేళ్లు కావాలని రాజ్యసభలో గళం విప్పిన వెంకయ్య ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.. వెంటనే వెంకయ్యనాయుడు సైతం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు..
కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రాజీనామా చేయాలి - విద్యార్ది జేఎసీ డిమాండ్
Reviewed by ADMIN
on
March 24, 2018
Rating:
No comments: