మందు బంద్...
THE BULLET NEWS (NELLORE)-మద్యం దుకాణాల నిర్వహణ తలకు మించిన భారం కావడంతో ప్రభుత్వంపై పోరు సాగించేందుకు మొత్తంగా వ్యాపారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేసి తమ నిరసన ప్రభుత్వానికి తెలియజేసేందుకు పోరుబాట పట్టనున్నారు.
ఎలాగైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గతంలో మాదిరిగా అమ్మకాలపై 18 శాతం మార్జిన్ సాధించేంత వరకు ఆందోళనను విరమించేది లేదని వ్యాపారులు స్పష్టం చేశారు.
జిల్లాలో 349 మద్యం షాపులు , 46 బార్లు ఉన్నాయి.వీటి ద్వారా సగటు రోజుకి రూ.2.5 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. గతంలో అమ్మకాలపై 18 శాతం మార్జిన్ ఉండేది.గత ఏడాది షాపుల టెండర్లు ప్రక్రియ గెజిట్ లో ప్రభుత్వం మార్జిన్ ను నమోదు చేయలేదు.కొత్త విధానంలో లైసెన్సుల ఫీజులను తగ్గించామని సాకుగా చూపి మద్యం అమ్మకాలపై వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను ఏడు శాతం తగ్గించింది.దీంతో వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.ఈ క్రమంలో సీఎం,ఎక్సైజ్ శాఖ మంత్రి,ఎక్సైజ్ కమిషనర్ మార్జిన్ శాతాన్ని గతంలో మాదిరిగా 18 శాతానికి పెంచాలని పలుమార్లు మద్యం వ్యాపారులు అభ్యర్థించగా ప్రభుత్వం పట్టించుకోలేదు.దీనికి తోడు ఎక్సైజ్ పోలీస్ అధికారులు వేధింపులు అధికమయ్యాయి. మరోవైపు వచ్చేయేడాదికి ఈ ఏడాది జూన్ 20 లోపు వ్యాపారులు లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సి ఉంది.వరుస నష్టాలతో ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా అమ్మకాలపై 18 శాతం మార్జిన్ను సాధించుకునేందుకు నెల్లూరు జిల్లా లిక్కర్ మర్చంట్ అసోసియేషన్ కార్యాచరణ రూపొందించింది.
ఎలాగైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గతంలో మాదిరిగా అమ్మకాలపై 18 శాతం మార్జిన్ సాధించేంత వరకు ఆందోళనను విరమించేది లేదని వ్యాపారులు స్పష్టం చేశారు.
జిల్లాలో 349 మద్యం షాపులు , 46 బార్లు ఉన్నాయి.వీటి ద్వారా సగటు రోజుకి రూ.2.5 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. గతంలో అమ్మకాలపై 18 శాతం మార్జిన్ ఉండేది.గత ఏడాది షాపుల టెండర్లు ప్రక్రియ గెజిట్ లో ప్రభుత్వం మార్జిన్ ను నమోదు చేయలేదు.కొత్త విధానంలో లైసెన్సుల ఫీజులను తగ్గించామని సాకుగా చూపి మద్యం అమ్మకాలపై వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను ఏడు శాతం తగ్గించింది.దీంతో వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.ఈ క్రమంలో సీఎం,ఎక్సైజ్ శాఖ మంత్రి,ఎక్సైజ్ కమిషనర్ మార్జిన్ శాతాన్ని గతంలో మాదిరిగా 18 శాతానికి పెంచాలని పలుమార్లు మద్యం వ్యాపారులు అభ్యర్థించగా ప్రభుత్వం పట్టించుకోలేదు.దీనికి తోడు ఎక్సైజ్ పోలీస్ అధికారులు వేధింపులు అధికమయ్యాయి. మరోవైపు వచ్చేయేడాదికి ఈ ఏడాది జూన్ 20 లోపు వ్యాపారులు లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సి ఉంది.వరుస నష్టాలతో ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా అమ్మకాలపై 18 శాతం మార్జిన్ను సాధించుకునేందుకు నెల్లూరు జిల్లా లిక్కర్ మర్చంట్ అసోసియేషన్ కార్యాచరణ రూపొందించింది.
మందు బంద్...
Reviewed by ADMIN
on
March 28, 2018
Rating:
No comments: