Top Ad unit 728 × 90

గూడూరు ఆదిశంకర కాలేజీ పై ఆగని నిరసనల హోరు

The bullet news ( Guduru)_ గూడూరు ఆదిశంకరలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన మాధవి మృతి పై సమగ్ర విచారణ జరపాలని, అనుమతి లేని హాస్టల్ ను మూసెయాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి వైయస్సార్ సిపి విద్యార్థి విభాగం నాయకులు మద్దతు తెలుపుతూ రిలే దీక్షలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కన్వీనర్ మనోజ్ మాట్లాడుతూ మాధవి ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహారదీక్షలు చేపట్టి న్యాయం జరిగేంతవరకు పోరాడతామన్నారు.. వైసీపీ విద్యార్థి సంఘ నాయకుడు పెంచల నాయుడు మాట్లాడుతూ కార్పొరేట్ కాలేజీలు చదువుల పేరుతో విద్యార్థులను చంపేస్తున్నాయని ఆరోపించారు.. తలిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నాయన్నారు.. మాధవి కేసు పై స్పందించకుంటే ఆదిశంకర కళాశాలలో జరిగే జేఎన్ టియు క్రీడా పోటీలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు..రిలే దీక్షలలో ఎబివిపి జిల్లా కన్వీనర్ మనోజ్ , వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు పెంచలనాయుడు , సాయి , పలువురు విద్యార్థి సంఘ నాయకులు చిన్నా , కోటయ్య , సూర్య , ఆదిల్ , ఖాజా , ఖయ్యూమ్ , రవి , సూర్య ఇంకా పలువురు పాల్గొన్నారు.
గూడూరు ఆదిశంకర కాలేజీ పై ఆగని నిరసనల హోరు Reviewed by ADMIN on March 28, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.