ఎబివిపి జిల్లా కన్వీనర్ గా మనోజ్ కుమార్ ఎంపిక
The bullet news ( Guduru)_ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ విద్యార్థుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన గూడూరు ఎబివిపి డివిజన్ కన్వీనర్ మనోజ్ కుమార్ నెల్లూరు జిల్లా కన్వీనర్ గా ఎంపిక అయ్యారు.. నిన్న నెల్లూరు విభాగ్ మీటింగ్ లో మనోజ్ ఎంపికను సంఘటనా కార్యదర్శి జగదీష్ ఖరారు చేశారు..ఈ సందర్భంగా గూడూరు డివిజన్ కమిటీ మనోజ్ కు అభినందనలు తెలిపింది.. ఓ సామాన్య కార్యకర్తగా ఎబివిపి లో చేరిన మనోజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా కన్వీనర్ గా ఎంపిక అవ్వడం ఆనందంగా ఉందని నగర కార్యదర్శి, నగర అధ్యక్షులు చిన్న, దొరబాబులు తెలిపారు.. నిరంతరం కృషి, పట్టుదల తో మనోజ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు..
ఎబివిపి జిల్లా కన్వీనర్ గా మనోజ్ కుమార్ ఎంపిక
Reviewed by ADMIN
on
March 22, 2018
Rating:
No comments: