ఆదిశంకర కాలేజి నిర్లక్ష్యమే మాధవిని చంపేసింది... గూడూరు లో విద్యార్థి సంఘాల ఆందోళన
The bullet news ( Gurduru) _ కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి.. గూడూరు ఆదిశంకర కాలేజీలో ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యండి.. మాధవి తలిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన వారిని కఠినంగా శిక్షించాలంటూ గూడూరు లో విద్యార్థి సంఘాలు రోడ్డు ఎక్కాయి.. స్థానిక సాధుపేట కూడలి వద్ద ఎబివిపి , టి ఎన్ ఎస్ ఎఫ్, ఏ ఐ ఎస్ ఎఫ్, వైసిపి విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆదిశంకర కళాశాల యాజమాన్యం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం విద్యార్ధి సంఘనాయకులు మాట్లాడుతూ కాలేజి యాజమాన్యం నిర్లక్ష్యమే మాధవి ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు.. నాలుగు రోజుల నుండి మాధవి మనస్తాపానికి గురైతే పట్టించుకునే వారే లేరా..? అని ప్రశ్నించారు.. మాధవి ఆత్మహత్య విషయంలో యాజమాన్య నిర్లక్ష్యం పై వారు మండిపడ్డారు. మరో విద్యార్థినికి ఇటువంటి దుస్థితి కలగకుండా వెంటనే సమగ్ర విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూడాలని, లేని పక్షంలో పోరాటం ఉదృతం చేసి నిరాహారదీక్షలకైనా వెనుకాడబోమని విద్యార్థి సంఘ నాయకులు స్పష్టం చేశారు. ఈ నిరసనలో ఎబివిపి జిల్లా కన్వీనర్ మనోజ్ , ఏ ఈ ఎస్ ఎప్ జిల్లా అధ్యక్షులు సునీల్ , టి ఎన్ ఎస్ ఎఫ్ పట్టణ అధ్యక్షులు నైముద్దీన్ , వైసీపీ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు
ఆదిశంకర కాలేజి నిర్లక్ష్యమే మాధవిని చంపేసింది... గూడూరు లో విద్యార్థి సంఘాల ఆందోళన
Reviewed by ADMIN
on
March 22, 2018
Rating:
No comments: