Top Ad unit 728 × 90

బీజేపీపై ఎన్నికల సంఘం సీరియస్.

THE BULLET NEWS (DELHI)-కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండానే... బీజేపీకి ముందే సమాచారం అందిందన్న ఆరోపణలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సంఘానికంటే ముందే బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ తేదీలతో సహా ట్విటర్లో ప్రకటించడం దుమారం రేపుతోంది. ఇవాళ ఎన్నికల సంఘం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే అంశం కలకలం రేపింది. ఈసీ అధికారికంగా ప్రకటించక ముందే మాలవీయకు తేదీలెలా తెలిశాయంటూ... మీడియా ప్రతినిధులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ... ‘‘దీన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నాం. ఎన్నికల సంఘం ద్వారా ఏదైనా తప్పు జరిగినట్టు తేలితే తీవ్ర చర్యలు తీసుకుంటాం....’’ అని ప్రకటించారు.

అయితే తాజాగా ఘనట వివాదం రేపినప్పటికీ ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ యథావిధిగా ముందుకెళ్లింది. దాదాపు మాలవీయ ప్రకటించిన తేదీలకు అటుఇటుగానే ఈసీ షెడ్యూల్ ప్రకటించినప్పటికీ.. ఓట్ల లెక్కింపు తేదీ మాత్రం వేరేగా ఉంది. మే 18న ఓట్ల లెక్కింపు ఉంటుందని మాలవీయ పేర్కొనగా మే15నే ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ... 24 తేదీలోపు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ప్రకటించింది.
బీజేపీపై ఎన్నికల సంఘం సీరియస్. Reviewed by ADMIN on March 27, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.