ప్రధానికి సాష్టాంగ నమస్కారం చేసిన విజయసాయిరెడ్డి - సీఎం రమేష్
THE BULLET NEWS (NEW DELHI)-వైసీపీ ఎంపీ విజయసాయి ఆంధ్రుల గౌరవాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరించారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ విమర్శించారు. ఏపీ ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే.. వైసీపీ దానికి తూట్లు పొడుస్తోందని సీఎం రమేశ్ విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ కాళ్లపై పడి నమస్కారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యసభలో ప్రధాని వస్తుంటే నమస్కారం చేయడం సహజమేనని.. అయితే విజయసాయిరెడ్డి ఏకంగా ప్రధాని వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారన్నారు. వైసీపీ ఓ వైపు అవిశ్వాసం అంటూనే మరోవైపు ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు.
ప్రధానికి సాష్టాంగ నమస్కారం చేసిన విజయసాయిరెడ్డి - సీఎం రమేష్
Reviewed by ADMIN
on
March 27, 2018
Rating:
No comments: